Followers

14న జిల్లా స్థాయి క్రికెట్ పోటీలు ప్రారంభం

 14న జిల్లా స్థాయి క్రికెట్ పోటీలు ప్రారంభం

మంచిర్యాల, పెన్ పవర్

మంచిర్యాల జిల్లాలో కొక్కిరాల రఘుపతి రావు చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఈ నెల 14వ తేదీ నుండి మంచిర్యాల జిల్లా స్థాయి క్రికెట్ పోటీలు ప్రారంభం కానున్నట్లు ఏఐసిసి సభ్యులు మాజీ ఎమ్మెల్సీ ప్రేమ్ సాగర్ రావు శుక్రవారం తన నివాసంలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఈ పోటీలకు ముఖ్య అతిథులుగా భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ హెచ్సఎ అధ్యక్షులు అజారుద్దీన్, టిపిసిసి అధ్యక్షులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, సిఎల్సి నేత మల్లు భట్టి విక్రమార్క, మాజీ మంత్రి డి. శ్రీధర్ బాబు, కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు జగ్గారెడ్డి, సీతక్క హాజరుకానున్నారని ఆయన వివరించారు. టోర్నమెంట్లో పాల్గొనే అన్ని జట్లుకు చెందిన క్రీడాకారులు యూనిఫామ్ ధరించి మధ్యాహ్నం 3 గంటలకు బాయ్స్ హైస్కూల్ గ్రౌండ్ కు హాజరుకావాలని ఆయన సూచించారు. పోటీల ప్రారంభంలో భాగంగా డ్రా జ్యోతిపజ్వల, టర్చ్ మార్చ, సాంస్కృతిక కార్యక్రమాలు జరుగుతాయని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖ, టిపిసిసి అధికార ప్రతినిధి చిట్ల సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.

No comments:

Post a Comment

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...