17న తైబజార్ నిర్వహణకు బహిరంగ వేలం
మంచిర్యాల ,పెన్ పవర్
మంచిర్యాల మున్సిపాలిటీ పరిధిలో 2021 - 22 సంవత్సరానికి మేకల మండి, తైబజార్, ఫ్లాట్ ఫామ్స్, మున్సిపల్ దుకాణాల నిర్వాహకులు ఈ నెల 17న బహిరంగ వేలం నిర్వహిస్తున్నట్లు మంచిర్యాల మున్సిపల్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో కమిషనర్ జి స్వరూప రాణి తెలిపారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ, ఈ నెల 10వ తేదీన జరగాల్సిన వేలం పాటకు దరఖాస్తులు తక్కువగా రావడంతో మున్సిపాలిటీ ఆదాయానికి నష్టం జరిగే అవకాశం ఉండడంతో వాయిదా వేసినట్లు పేర్కొన్నారు. ఈ నెల 17న జరిగే బహిరంగ వేలంలో ఆసక్తి ఉన్న వారు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని కమిషనర్ కోరారు.

No comments:
Post a Comment