Followers

21న జరిగే ఎన్నికలను విజయవంతం చేయండి

 21న జరిగే ఎన్నికలను విజయవంతం చేయండి 

లక్షెట్టిపెట్,పెన్ పవర్

21వ తారికిన పట్టణం కేంద్రంలో జరిగే విశ్వబ్రాహణ సంఘం ఎన్నికలను ప్రతీ ఒక్కరూ విజయవంతం చేయాలని ఆ సంఘం అధ్యక్షుడు బానాల రమేష్ పిలుపునిచ్చారు.పట్టణంలోని విశ్రాంతి భవనంలో శనివారం జరిగిన సంఘ సభ్యుల సమావేశంలో ఆయన మాట్లాడారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గతంలో లేని విధంగా ఈ ఏడాది జరిగే సంఘం ఎన్నికల్లో ఐదు కులాలు ఏకమై నిర్వహించడం జరుగుతుందన్నారు.అందులో వడ్ల కుమ్మరి,అవుసుల,కాంచరి,శిల్పి కులాలకు చెందిన పురుషులు స్త్రీ లు పాల్గొని తమ ఓటును వేసి సంఘం అధ్యక్షుడిని ఎన్నుకోవాల్సి ఉంటుందన్నారు.ఈ ఎన్నికలు ఒక మండలంలోనే కాకుండా జిల్లా వ్యాప్తంగా కూడా అదే రోజు ఏకాదటిగా నిర్వహించడం జరుగుతుందని ఒక్కొక్కరు మండల అధ్యక్షునీతో పాటు జిల్లా అధ్యక్షున్నీ రాష్ట్ర అధ్యక్షున్నీ కూడా అదే రోజు ఎన్నుకోవాల్సి ఉందన్నారు.గత ఐదు కులాలకు చెందిన 18సంవత్సరాలు వయస్సు పై బడిన వారందరు ఓటు వేసేందుకు అవకాశం ఉందన్నారు. ఓటు వేసేందుకు వచ్చే ప్రతీ ఒక్కరు ఏదైనా ప్రభుత్వం జారీ చేయబడిన గుర్తింపు కార్డు తప్పకుండా వెంట తీసుకొని రావాలని ఆయన కోరారు.ఈ కార్యక్రమంలో ఐదు సంఘాల ముఖ్య సభ్యులు వెంకటేష్,సత్యనారాయణ,మురళి,శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు.

No comments:

Post a Comment

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...