ఆత్మహత్య చేసుకుంటానని ప్రభుత్వ ఆసుపత్రి పైకి ఎక్కి బెదిరింపు
మంచిర్యాల , పెన్ పవర్
మంచిర్యాల ప్రభుత్వ ఆసుపత్రి భవనం పైకి ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకుంటానని ఓ గంట పాటు బెదిరింపులకు పాల్పడ్డాడు. మంగళవారం భార్య భర్తల గొడవల వల్ల పోలీసులు సహకరించాలని కోరుతూ ప్రభుత్వ ఏరియా ఆస్పత్రిలో భవనం పైకి ఎక్కి ఆత్మహత్య చేసుకుంటానని హల్చల్ సృష్టించాడు. మంచిర్యాలలోని హమాలివాడ చెందిన పసుపులేటి శేఖర్ . వివరాల్లోకి వెళితే తన భార్య తనకు మధ్య మనస్పర్ధలు , గొడవలు జరగడంతో పసుపులేటి శేఖర్ ప్రభుత్వాసుపత్రి పైకి ఎక్కి కిందికి దూకుతానని బెదిరింపుకి పాల్పడ్డాడు.అక్కడే విధుల్లో ఉన్న కానిస్టేబుల్ భూపతి రెడ్డి సమయస్ఫూర్తి తో వ్యవహరించి శేఖర్ భార్య ఫోన్లో మాట్లాడుతుందని చెప్తూ నీతో మాట్లాడుతది అంటూ మాటల్లో పెట్టి కిందికి లాగేసాడు. కాగా ఎస్ఐ ప్రవీణ్ బాధితుడు శేఖర్ ను పోలీస్ స్టేషన్ కు అదుపులో కి తీసుకొని పోలీస్ స్టేషన్ కు తరలించారు.దీంతో గంటపాటు హైరానాపడ్డ ప్రభుత్వ ఆసుపత్రి సిబ్బంది ఊపిరిపీల్చుకున్నారు.


No comments:
Post a Comment