ఉత్తర నియోజకవర్గ కార్పొరేటర్ లతో సమావేశమైన కె.కె.రాజు
విశాఖ, పెన్ పవర్
జీవీఎంసీ ఎన్నికల్లో విజయం సాదించిన ఉత్తర నియోజకవర్గ పరిధి కార్పొరేటర్ ల తో విశాఖ ఉత్తర నియోజకవర్గ సమన్వయకర్త కె కె రాజు ఆయన కార్యాలయంలో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ప్రతీ ఒక్కరిని అభినందించారు.ఈ సందర్భంగా కె కె రాజు మాట్లాడుతూ ప్రజలు వై ఎస్ జగన్మోహన్ రెడ్డి అభివృద్ధి చూసి మరియు మనల్ని నమ్మి ఓటువేసి కార్పొరేటర్ లగా గెలిపించారని అదే నమ్మకం మనపై ఎల్లప్పుడూ వుండేలా విశాఖ అభివృద్ధి లో పలుపంచుకుంటూనే మీ ప్రాంతంలో అభివృద్ధి అన్ని విధాలా పని చేయాలని కోరారు. అనంతరం రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి వద్దకు వెళ్లి ఆయనతో కూడా సమావేశమయ్యారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ పరిశీలకులు రవి రాజు,కాయల వెంకట రెడ్డి, వరుదు కల్యాణి,చొక్కాకుల వెంకట రావు, బీశెట్టి కాశీ విశ్వనాధం, పీలా ఉమా రాణి, మాధవి వర్మ తదితరులు పాల్గొన్నారు.

No comments:
Post a Comment