Followers

శివారు రైతులకు నీటి కష్టాలు

 శివారు రైతులకు నీటి కష్టాలు

పెన్ పవర్,పెంటపాడు

సాగునీరు అందక పంటపోలాలు ఎండిపోతున్న ప్రభుత్వం నిమ్మకు నీరెత్తిన్నట్లు వ్యవహరిస్తుందని రాష్ట్ర తెలుగురైతు అధ్యక్షులు మార్రెడ్డి శ్రీనివాసరెడ్డి ఆరోపించారు పెంటపాడు మండలములోని పలుశివారు ప్రాంతాలతోపాటు జిల్లా వ్యాపితంగా సాగునీరు అందడం లేదని తెలిపారు.రైతుల కోరిక మేరకు తెలుగురైతు బృందము కస్పా పెంటపాడు శివారు ముక్తేపురం పోలాలను పరిశీలించారు.గడచిన 10 రోజులుగ సాగునీరు అందక పంటభూములు నెరలు తీసాయని బృందము పరిశీలించింది.గడచిన సార్వా సీజన్ అదిక  వర్షాల ఎకరాన్నికి 20 వేలు నష్టపోయిన  తమకు ప్రస్తుత సాగునీటి వల్ల మరింత నష్టం జరిగేతే అత్మహత్యలు చేసుకొనే పరిస్తితి ఉన్నాయి అని  రైతులు బృందనాకి వివరించారు.ఈ కార్యక్రమములోగూడెం టీడీపి ఇంచార్జి  వలవల బాబ్జీ,నరసాపురం ,ఏలూరు ,గుంటూరు పార్లమెంట్ తెలుగురైతు అధ్యక్షులు పాతూరి రామ్ ప్రసాద్ చౌదరి ,గుత్తా వెంకటేశ్వరరావు కళ్లెం రాజశేఖర్ రెడ్డి ,కస్పా పెంటపాడు, పెదతాడేపల్లి సర్పంచ్లు పీతల సత్యనారాయణ ,పోతుల అన్నవరం మాజీ జడ్ పి టి సి కిలపర్తి వెంకట్రావు మాజీ ఎం పి పి  పరిమి రవికుమార్  మాజీ డీసీసీబీ  డైరెక్టర్ దాసరి అప్పన్న మాజీ ఏ ఎం సి  సభ్యులు ఇమ్మంది లక్ష్మయ్య అచ్యుత సత్యనారాయణ నవాబుపాలెం మాజీ సోసైటీ అధ్యక్షులు పరిమి వీరభద్రరావుతదితరులు పాల్గొన్నారు.

No comments:

Post a Comment

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...