కాలనీ సమస్యలు పరిష్కరించాలని ఎమ్మెల్యేకు వినతి
జీడిమెట్ల,పెన్ పవర్
కుత్బుల్లాపూర్ నియోజకవర్గం, 132 జీడిమెట్ల డివిజన్ పరిధిలోని ప్రసూన నగర్ కు చెందిన సంక్షేమ సంఘం సభ్యులు గురువారం ఎమ్మెల్యే కేపి వివేకానంద్ నివాసం వద్ద మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా తమ ప్రాంతంలో మిగిలి ఉన్న నాలా అభివృద్ధి పనులు, సీసీ రోడ్లను పూర్తి చేయాలని కోరుతూ ఎమ్మెల్యేకి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే స్పందిస్తూ సంబంధిత అధికారులతో ఫోన్ లో మాట్లాడారు రూ.70 లక్షలతో నూతనంగా నిర్మిస్తున్న నాలా అభివృద్ధి పనులు వేగంగా పూర్తి చేయాలని అధికారులకు సూచించారు. అలాగే ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా సీసీ రోడ్డు పనులు వారంలో పూర్తి చేసి ప్రజలకు అందుబాటులో తీసుకువస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో కాలని సంక్షేమ సంఘం అధ్యక్షుడు నాగశేఖర్ గౌడ్, ప్రధాన కార్యదర్శి సి.హెచ్.శంకర్, సలహాదారు ఎస్.నాగేశ్వర్ రావు, పి.లింగం తదితరులు పాల్గొన్నారు.

No comments:
Post a Comment