పట్టణాల్లో తాగునీటి సమస్య లేకుండా చూస్తాం
ఆదిలాబాద్ మున్సిపల్ చైర్మన్ జోగు ప్రేమెందర్
ఆదిలాబాద్,పెన్ పవర్
పట్టణంలో తాగునీటి సమస్య లేకుండా చేస్తామని మున్సిపల్ చైర్మన్ జోగు ప్రేమెందర్ అన్నారు. గురువారం కైలానగర్ , న్యూ హౌసింగ్ బోర్డు కాలనీలలో మిగిలిపోయిన మిషన్ భగీరథ పైప్ లైన్ పనులకు భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇంటింటికి తాగునీరు అందించాలనే లక్ష్యంతో సీఎం కేసీఆర్ చేపట్టిన మిషన్ భగీరథ పనులు పూర్తి కవచ్చయని తెలిపారు. మరికొన్ని వార్డుల్లో పనులు నిలిచి పోవడంతో ఎమ్మెల్యే జోగు రామన్న గారు సహరంతో 52 కిలోమీటర్ల పైప్ లైన్ పనులు మంజూరు అయ్యాయని తెలిపారు. ప్రస్తుతం పట్టణంలో తగు నీటి సమస్య లేదని, గతంలో మార్చి నెలలో నీటి సమస్య తలెత్తే దని పేర్కొన్నారు. ఈ నెలాఖరుకల్లా పైప్ లైన్ పనులు పూర్తి చేసుకొని వేసవి కాలంలో ప్రతి రోజూ ఇంటింటికి తాగునీరు అందిస్తామని అన్నారు.

No comments:
Post a Comment