డిటి రాజబాబు ఆధ్వర్యంలో పోలింగ్ కు అన్ని ఏర్పాట్లు పూర్తి
తాళ్ళపూడి, పెన్ పవర్తాళ్ళపూడి జిల్లా ప్రజా పరిషత్ ఉన్నత పాఠశాల లో ఆదివారం జరగబోయే ఉభయగోదావరి జిల్లాల టీచర్ ఎం యల్ సి ఎన్నికల కు తహశీల్దార్ మరియు ఎన్నికల అధికారి ఎం.నరసింహమూర్తి ఆదేశాల మేరకు ఏర్పాట్లు సిద్ధం చేయబడ్డాయి. డిటి రాజబాబు మాట్లాడుతూ ఉదయం 8 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు ఓటింగ్ సమయం అని, ఈ సమయంలో ఉపాద్యాయులు ఓటు వేయవచ్చునని, తాళ్ళపూడి మండలం లో ఓటు హక్కు గల ఉపాద్యాయులు 61 మంది అని, శనివారం జరగబోయే ఎన్నికల కు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో యస్ఐ జి.సతీష్, పోలీస్ సిబ్బంది, విఆర్వో లు ప్రకాష్, లీలావతి, స్వర్ణ, ప్రిసైడింగ్ ఆఫీసర్, హెల్పర్స్, తదితరులు పాల్గొన్నారు.

No comments:
Post a Comment