బుగ్గ రాజ రాజేశ్వర దేవాలయంలో మొక్కులు చెల్లించుకున్న బండి సదానందం
మందమర్రి, పెన్ పవర్
మహాశివరాత్రి సందర్భంగా బెల్లంపల్లి మండలంలోని బుగ్గ రాజా రాజేశ్వర దేవాలయంలో గురువారం అఖిలభారత యాదవ్ మహాసభ జిల్లా అధ్యక్షులు, టిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు బండి సదానందం యాదవ్ మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం ఆలయ కమిటీ చైర్మన్ శ్రీదేవి శ్రీరాములు, స్థానిక కన్నాల సర్పంచ్ జిల్లపెల్లి సరూప వెంకటస్వామి లు బండి సదానందం కు ప్రత్యేక దర్శనం చేయించి ఆయనను ఘనంగా సన్మానించారు. అఖిల భారత యాదవ మహాసభ రాష్ట్ర సీనియర్ నాయకులు గేళ్ళి రాజలింగు ఆధ్వర్యంలో బండి సదానందం యాదవ్ చేతుల మీదగా మజ్జిగ పంపిణీ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా బండి సదానందం యాదవ్ భక్తులందరినీ ఎల్లవేళలా ఆయురారోగ్యాలతో పాటు సుఖసంతోషాలతో ఆ భగవంతుడు అందరిని చల్లగా చూడాలని కోరుకున్నారు.


No comments:
Post a Comment