విశాఖ ఏజెన్సీలో ఆహార శుద్ధి యంత్రాలు ఏర్పాటు చేస్తాం
పెన్ పవర్,విశాఖపట్నంవిశాఖ ఏజెన్సీలో ఆహారశుద్ధి యంత్రాలను ఏర్పాటు చేసేందుకు ప్రణాళిక సిద్ధం చేయాలని పాడేరు సముగ్ర గిరిజనాభివృద్ధి సంస్థ( ఐ టి డి ఎ) ప్రాజెక్ట్ అధికారి వెంకటేశ్వర సలిజామల అన్నారు. శనివారం తన కార్యాలయంలో సంబంధిత అధికారులతో సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వ్యాపార విపణిలో ఆర్గానిక్ వస్తువులకు చాలా డిమాండ్ ఉందని. ఆ దిశలో ప్రయోగాత్మకంగా గిరిజనులు పండించే తృణ ధాన్యాలను మెరుగుపరిచి మార్కెట్ చేయడంవల్ల గిరిజనులకు ఆదాయ వనరులు చేకూరుతాయి అన్నారు. గిరిజనులు సేంద్రీయ పద్ధతిలో సాగుచేస్తున్న కాపీ పసుపు చింతపండు మిరియాలు సొల్లు సామలు కొర్రలు అల్లం పాల పిండి వంటి పదార్థాలను మెరుగుపరిచి మార్కెట్ చేసే సౌకర్యం కల్పిస్తామన్నారు. ఏజెన్సీ ప్రాంతంలో గిరిజన ఉత్పత్తులతో ఆహార యూనిట్లు ఏర్పాటు చేయాలనే లక్ష్యంతో ప్రణాళికలు సిద్ధం చేయాలని అన్నారు. గిరిజనులు సేంద్రీయ విధానంలో పండిస్తున్న తృణధాన్యాలు ఇతరత్రా వ్యవసాయ ఉత్పత్తులను వారపు సంతల్లో విక్రయిస్తున్నారని అందువల్ల దళారిల దోపిడీలకు గురవుతున్నారని అన్నారు. ఈ మేరకు గిరిజనులకు తగిన ఆదాయం సమకూరే లా ఐ టి డి ఎ ద్వారా ఆహార యూనిట్లు నెల్ల కల్పిస్తామన్నారు. దేనికి సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవాలని పీవో వెంకటేశ్వర్ ఆదేశించారు.

No comments:
Post a Comment