ప్రశాంతంగా ముగిసిన సి ఓ ఈ ప్రవేశ పరీక్ష
పర్యవేక్షించిన ఆర్సీఓ కొప్పుల స్వరూపారాణి.
బెల్లంపల్లి , పెన్ పవర్
ఉదయం 8గం.ల కే సెంటర్ల కు చేరుకున్న విద్యార్థులు. ఉదయం 10గo.లకు ప్రారంభమై 1గం.కు ముగిసింది.తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల విధ్యాలయాల సంస్థ ఆద్వర్యంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించబడుతున్న సి ఓ ఈ (సెంటర్ ఆఫ్ ఎక్స్ లెన్సీ) ల్లో వచ్చే విద్యా సంవత్సరానికిగాను ఇంటర్ మీడియట్ ప్రధమ సంవత్సరంలో అడ్మిషన్ కోసంనిర్వహించిన సిఓఈ ప్రధమ స్క్రీనింగ్ టెస్ట్ శనివారం ప్రశాంతంగా ముగిసింది. ఆదిలాబాద్ రీజియన్ వ్యాప్తంగా ఏర్పాటుచేసిన 10 పరీక్షా కేంద్రాలకు సంబంధించిన సౌకర్యాల విషయమై ఆర్సీఓ ఎప్పటికప్పుడు ఆడిగితెలుసుకుంటు విద్యార్థులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ప్రశాంతంగా పరీక్ష వ్రాసేలా సమన్వయంచేశారు. రీజియన్ వ్యాప్తంగా 10 సెంటర్లలో 2694మందికి గాను 2385 మంది పరీక్ష వ్రాయగా 309 మంది గైర్ హాజరయ్యారు. 88.53 శాతం హాజరైనట్లు ఆర్సీఓ కే.స్వరూపారాణి తెలిపారు. సంక్షేమ గురుకులాల ఆదిలాబాద్ ప్రాంతీయ సమన్వయాధికారిని (ఆర్సీఓ) కొప్పుల స్వరూపరాణి బెల్లంపల్లి లోని బాలుర,బాలికల సెంటర్లతోపాటు చెన్నూర్, జైపూర్* సెంటర్లను సందర్శించారు. రూట్ ఆఫీసర్ గా ఏఆర్సీఓ కోటిచింతల మహేశ్వర రావు, చీఫ్ సూపరింటెండెంట్స్ గా సంబంధిత ప్రిన్సిపాల్స్ ఐనాల సైదులు, యస్.స్వరూప, ఆర్ బాలభాస్కర్, రాజమణి, లలితకుమారి, స్వర్ణలత, శ్రీనివాస్ రావు, ప్రవీణ్ కుమార్, శ్రీధర్,సంగీత లు వ్యవహరించారు. బెల్లంపల్లి లోని బాలుర మరియు బాలికల సెంటర్ల వద్ద తాళ్ళ గురజాల పోలీస్ స్టేషన్ ఎస్సై సమ్మయ్య ఆధ్వర్యంలో పటిష్టమైన పోలీస్ బందోబస్తును ఏర్పాటుచేశారు.

No comments:
Post a Comment