బెల్లంపల్లి లేబర్ యూనియన్ కి ఏకగ్రీవంగా అధ్యక్షునిగా ఎన్నికైన కాసర్ల యాదగిరి
బెల్లంపల్లి,పెన్ పవర్
మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి లోని రోజువారి కూలి సంఘం అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా కాసర్ల యాదగిరి ని ఎన్నుకోవడం జరిగింది.యాదగిరి మాట్లాడుతూ ప్రతి ఒక్క లేబర్ యూనియన్ కార్డు కలిగి ఉండాలని కొంతమంది పనికి కార్మికులను తీసుకెళ్తూ యజమాని వద్ద ఆరు వందల రూపాయలకు అగ్రిమెంట్ కుదుర్చుకుని కూలీలకు 400. 500. ఇస్తూ వారి యొక్క రెక్కల కష్టాన్ని దోచుకుంటున్నారు అలాంటి వ్యక్తులు మళ్లీ ఇలాంటి సమస్య పునరావృతం కాకూడదని కోరుతూ ఈ యొక్క సంఘం ఆకలితో ఏర్పడ్డ సంఘం అని హక్కులు సాధించుకునేందుకు నిరంతరంగా కృషి చేస్తామని బెల్లంపల్లి చుట్టుపక్కల ఫ్లై ఓవర్ నిర్మాణాలు రైల్వే పనులు హైవే పనులు బెల్లంపల్లి భవన కార్మికుల ను 30 శాతం వరకు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ మా యొక్క సంఘం ఏ రాజకీయ పార్టీకి సంబంధం లేదు ఇది హక్కుల కోసం ఏర్పడ్డ సంఘం అని గుర్తించాలని అదే విధంగా అన్ని పార్టీలు అన్ని సంఘాలు మాకు మద్దతుగా ఉండాలని కొంతమంది కాంట్రాక్టర్లు ఇతర రాష్ట్రాల నుండి కూలీలను తీసుకు రావడం వల్ల బెల్లంపల్లి కార్మికులు తిరని అన్యాయం జరుగుతుందని అని అన్నారు రోజుకు కార్మికులు సుమారుగా 500 మంది వస్తూ 300 మంది పని దొరకకా వెనుకకు పోతున్నారు కాబట్టి బెల్లంపల్లి కార్మికులకు పని కల్పించాలని అన్నారు ఒక సంఘం నిర్మాణానికి నా మీద నమ్మకంతో అధ్యక్షునిగా ఏకగ్రీవంగా ఎన్నుకున్న సభ్యులందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తూ త్వరలోనే భవిష్యత్ కార్యాచరణ చేపడతామని అన్నారు

No comments:
Post a Comment