Followers

ఎమ్మెల్సీ ఎన్నికల సన్నాహక సమావేశంలో విశాల్ గౌడ్..

 ఎమ్మెల్సీ ఎన్నికల సన్నాహక సమావేశంలో విశాల్ గౌడ్..

జీడిమెట్ల,పెన్ పవర్

జీడిమెట్ల డివిజన్ పరిధిలోని అయోధ్య నగర్ లో టి.ఆర్ఎస్. పార్టీ నాయకులు కె.పి. విశాల్ గౌడ్ ఆధ్వర్యంలో ఎమ్మెల్సీ ఎన్నికల సన్నాహక సమావేశం ఏర్పాటు చేశారు.. ఈ సందర్భంగా విశాల్ మాట్లాడుతూ మన రాష్ట్రం బంగారు తెలంగాణ కావాలంటే ,అది కేవలం మన రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ వల్లనే సాధ్యమవుతుందని అన్ని మతాలను, కులాలను కలుపుకొని పోయే పెద్ద మనసు కె.సీ.ఆర్.దని కావున మార్చి 14 వ తారీకున జరగబోయే పట్టభద్రుల ఎన్నికలలో ముఖ్యమంత్రి కే.సీ.ఆర్. బలపరిచిన అభ్యర్థి సురభి వాణి దేవికి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని కే.పి విశాల్ గౌడ్ ఓటర్లను కోరారు.ఈ కార్యక్రమంలో గ్రాడ్యుయేట్ ఓటర్లు మరియు టిఆర్ఎస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.

No comments:

Post a Comment

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...