శంభో శివ శంభో
ఘనంగా మహాశివరాత్రి వేడుక\భక్తులతో కిటకిటలాడిన గోదావరి
లక్షెట్టిపెట్,పెన్ పవర్
పట్టణంతో పాటు మండలంలోని అన్ని గ్రామాల్లో హిందూ భక్తులు మహాశివరాత్రి వేడుకని గురువారం ఘనంగా జరుపుకున్నారు.వేకువ జమునే కుటుంబ సభ్యులతో కలిసి గోదావరి నదిలో పుణ్యస్నానాలు ఆచరించి అనంతరం సమీపంలోని శివాలయం ఆలయంకి చేరుకొని పూజలు నిర్వహించారు.భక్తులతో గోదావరి నది సమీపం మొత్తం కిటకిటలాడింది.వచ్చిన భక్తులకు స్నానాల గదులు షవర్లుతో పాటు మహిళలు బట్టలు మార్చుకునే గదులను మెడికల్ క్యాంప్ లను అధికారులు ఏర్పాటు చేసారు.మున్సిపల్ అధికారులు ప్రజాప్రతినిధులు ఎప్పటికప్పుడు పుణ్యస్నానాలకు వచ్చే భక్తుల బాగోగులు చూసుకున్నారు.పోలీస్ ఆధ్వర్యంలో సీఐ నారాయణ నాయక్ ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా మంచి బందోబస్తు ఏర్పాటు చేశారు.ట్రాఫిక్ సమస్యతో పాటు ఇతర సమస్యలు తలెత్తకుండా ముందు జాగ్రత్తలు తీసుకున్నారు.మంచిర్యాల ఏసీపీ అఖిల్ మహాజన్ గోదావరి నది వద్ద పరిశీలించి భక్తులతో ఎలాంటి ఇబ్బందులు ఉన్నాయా అని వివరాలు అడిగి తెలుసుకున్నారు. మంచి ఏర్పాట్లు పై హర్షం వక్తం చేశారు.




No comments:
Post a Comment