భారతీయ జనతా పార్టీలోకి కాంగ్రెస్ పార్టీ నుండి భారీ చేరికలు..
కుత్బుల్లాపూర్,పెన్ పవర్
గాజులరామారం లోని చిత్తారమ్మ టెంపుల్ దగ్గర కమిటీ హాల్ లో జరిగిన బిజెపి నాయకుల కార్యకర్తల పట్టభద్రుల సమ్మేళన కార్యక్రమం మాజీ ఎమ్మెల్యే శ్రీ కూన శ్రీశైలం గౌడ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేశారు. 125 డివిజన్,129 డివిజన్ ల నుండి భారతీయ జనతా పార్టీ లోకి కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు భారీ ఎత్తున చేరారు. ఈ సందర్భంగా కూన శ్రీశైలం గౌడ్ మాట్లాడుతూ రాబోయే పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో బిజెపి అభ్యర్థి శ్రీ రామచంద్ర రావును అత్యధిక మెజారిటీతో గెలిపించాలని విద్యావంతులకు, మేధావులకు, పట్టభద్రులకు విజ్ఞప్తి చేశారు, కాంగ్రెస్ పార్టీ నుండి బిజెపిలో చేరిన వారంతా కూడా ప్రతి బస్తీలలో పాల్గొనాలని, ప్రతి ఒక్కరూ బాధ్యత తీసుకుని 25 మంది పట్టభద్రుల ఓటర్లను కలిసి టిఆర్ఎస్ ప్రభుత్వం చేస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను, వారు చేస్తున్న దౌర్జన్యాలను పట్టభద్రుల ఓటర్లకు వివరించి రామచంద్ర రావుని గెలిపించాలని కూన శ్రీశైలం గౌడ్ కోరారు. డివిజన్ లో ఉన్న భారతీయ జనతాపార్టీ నాయకులు కొత్త పాత అని విభేదాలు లేకుండా అందరూ కలిసి పార్టీ పటిష్టతకు కృషి చేయాలని, రాబోయే రోజుల్లో తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఏర్పడేలా మనం అందరం కలిసి పని చేద్దామని, రాబోవు రోజుల్లో బస్తీలలో మరియు కాలనీలలో ఉన్న ప్రజలు ఎదుర్కొంటున్న పలు సమస్యలపై పోరాటం చేద్దామని కూన శ్రీశైలంగౌడ్ అన్నారు . ఈ కార్యక్రమంలో మేడ్చల్ జిల్లా ప్రధాన కార్యదర్శి గిరి వర్ధన్ రెడ్డి, బిజెపి నాయకులు కేకే ఏం ట్రస్ట్ చైర్మన్ కూన శ్రీనివాస్ గౌడ్, బక్క శంకర్ రెడ్డి, నందనం దివాకర్, నటరాజ్ గౌడ్, సాయినాథ్ నేత, ఎం ఎస్ వాసు, బుచ్చి రెడ్డి, యామ్ సాగర్, పులమ్మ,వర్మ, బలరాం, సుశాంత్, గాదె వినోద్, లక్ష్మి బిక్షపతి, రమేష్, నర్సింగ్ రావు, నందు, సంగీత, తదితరులు పాల్గొన్నారు.

No comments:
Post a Comment