సింగరేణి కార్మికుని ఆత్మహత్య
మందమర్రి , పెన్ పవర్మందమర్రి పట్టణంలోని 3వ జోన్ కు చెందిన సింగరేణి కార్మికుడు తైదల ప్రసాద్ సోమవారం ఉదయం తన నివాసంలో ఇంట్లో ఎవరు లేని సమయంలో ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మందమర్రి ఏరియాలోని కేకే 1 గనిలో విధులు నిర్వహిస్తున్న ప్రసాద్ ఆత్మహత్యకు గల కారణాలు తెలియరాలేదు. మృతునికి తల్లి, బార్య, కుమారుడు కలరు.ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పట్టణ ఎస్ఐ లింగంపల్లి భూమేష్ పేర్కొన్నారు.

No comments:
Post a Comment