Followers

తాండూర్ ఇసుక రీచ్ కాంట్రాక్టర్ పై చర్యలు తీసుకోవాలి

 తాండూర్ ఇసుక రీచ్ కాంట్రాక్టర్ పై చర్యలు తీసుకోవాలి

ప్రభుత్వం, అధికారుల నిర్లక్ష్యంతో సంకే శ్రీనివాస్ మృతి

మృతుని కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలి

సీపీఎం తాండూరు మండల కార్యదర్శి దాగం రాజారాం 

మంచిర్యాల,పెన్ పవర్


తాండూర్ ఐబి కేంద్రంలో ఏర్పాటు చేసినపాత్రికేయుల సమావేశంలో  సీపీఎం పార్టీ తాండూరు మండల కార్యదర్శి దాగం రాజారాం మాట్లాడుతూ మంచిర్యాల జిల్లా జైపూర్ మండలం వేలాల గోదావరి తీరం నుండి ప్రభుత్వం చేపడుతున్న మల్లన్న సాగర్ ప్రాజెక్టు పేరుతో గోదావరి లో నడుస్తున్న ఇసుక రీచ్ లు,ఈ ఇసుకను మల్లన్న సాగర్ ప్రాజెక్టు కు తరలించే పేరుతో బయట అమ్ముకుంటూ లక్షలాది రూపాయలు సొమ్ము చేసుకుంటున్నా కాంట్రాక్టర్.ఇదిలా ఉండగా శివరాత్రి పండుగ సందర్భంగా లక్షలాది మంది భక్తులు గోదావరి స్థానానికి వెళ్లే అవకాశం ఉన్నప్పటికీ ఈ క్రమంలో సంబంధిత అధికారులు కనీసం ఇసుక రీచ్ల ప్రాంతంలో హెచ్చరిక బోర్డులు రక్షణ చర్యలుమ్ ఏర్పాటు చేయకపోవడం, జాతర ఉన్నా లేకపోయినా ఈ ఇసుక రీచ్ ప్రాంతంను నిషేధిత ప్రాంతంగా లేదా హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయాల్సి ఉన్న ప్రభుత్వం, అధికారులు మాత్రం చర్యలు తీసుకోకుండా కేవలం కొనసాగించే దానికి మాత్రమే ప్రాధాన్యత ఇచ్చారన్నారు. తప్ప ప్రజల ప్రాణాలు గాలికి వదిలేశారని,అదేవిధంగా హిస్టరీ తిన ఇసుక రీచ్లు ఏర్పాటు చేయడం వల్లనే ఈ ప్రమాదం జరిగిందన్నారు.మృతికి కారణమైన అధికారులపై  ఇసుక రీచ్ కాంట్రాక్టర్ పై, చర్యలు తీసుకోవాలని, అధికారుల నిర్లక్ష్యం కారణంగానే మృతి చెందిన సంకె శ్రీనివాస్ కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని, మృతునికి భార్య, ఇద్దరు చిన్న ఆడపిల్లలు ఉన్నారు. వీరిని ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వం, జిల్లా అధికారులపై ఉందని, లేకపోతే ఇసుక రీచ్ ల వద్దనే ఆందోళనకు సిద్ధం అవుతామని,దీనికి ప్రభుత్వమే బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో నాయకులు సిపిఎం పార్టీ తాండూరు మండల కార్యదర్శి భాగం రాజారాం,బి రాజేశం,దుర్గం నానయ్య,రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.

No comments:

Post a Comment

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...