పౌష్టికాహారం అందజేత
పెన్ పవర్, కందుకూరు
పట్టణంలోని శ్రీరామ్ నగర్ కాలనీలో గల అంగన్వాడి సెంటర్ నందు గర్భిణీలు, బాలింతలు, చిన్నారులకు ఐసిడిఎస్ సిడిపిఓ లిడియమ్మ గురువారం పౌష్టికాహారాన్ని అందజేశారు. ఈ సందర్భంగా లిదియమ్మ మాట్లాడుతూ గర్భిణీలు, బాలింతలు, చిన్నారులు బలవర్ధకమైన విటమిన్లు ఉండే ఆహారాన్ని తీసుకోవాలని సూచించారు. అనంతరం అంగనవాడి కేంద్రంలో రికార్డులు పరిశీలించి పలు సూచనలు, సలహాలు అందించారు. ఈ కార్యక్రమంలో మహిళా పోలీస్ సునీత, అంగన్వాడీ కార్యకర్త ఝాన్సీ రాణి, తదితరులు పాల్గొన్నారు.

No comments:
Post a Comment