Followers

సాయిబాబా ఆలయ వార్షికోత్సవం లో పాల్గొన్న జెడ్పీ చైర్మన్ జనార్దన్ రాథోడ్

 సాయిబాబా ఆలయ వార్షికోత్సవం లో పాల్గొన్న జెడ్పీ చైర్మన్ జనార్దన్ రాథోడ్...




 ఆదిలాబాద్ ,  పవర్ పవర్

ఆదిలాబాద్ జిల్లా తలమడుగు మండలంలోని కుచలాపూర్ గ్రామంలో గల  సాయిబాబా ఆలయ 25వా వార్షికోత్సవాల్లో బుధవారం ఆదిలాబాద్ జడ్పీ చైర్మన్ జనార్ధన్ రాథోడ్, రాష్ట్ర డెయిరి చైర్మన్ లోక భూమారెడ్డి లతో కలిసి పాల్గొన్నారు. ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి బాబా ఆశీస్సులు తీసుకున్నారు. అనంతరం శ్రీ యోగానంద ఆశీస్సులు పొందారు. ఈ సందర్భంగా జెడ్పీ చైర్మన్ జనార్దన్ రాథోడ్ మాట్లాడుతూ ఆలయ అభివృద్ధికి తన వంతు కృషి చేస్తూ ఆలయ అభివృద్ధి కోసం తన నిధుల నుంచి రూ 5 లక్షలు మంజూరు చేస్తానని హామీ ఇచ్చారు. అంతకుముందు జడ్పీ చైర్మన్ గ్రామ కమిటీ సభ్యులు ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ మెట్టు ప్రహ్లాద్, జెడ్పిటిసి ఫోరం అధ్యక్షులు రాజు, ఆలయ అభివృద్ధి కమిటీ చైర్మన్ మతాని నారాయణ, ఎంపీపీ కళ్యాణం లక్ష్మి  రాజేశ్వర్, స్థానిక సర్పంచ్ మొహితే ప్రభ, దేవ్ రావు, గ్రామస్తులు సదాశివ, మల్లయ్య, ప్రభాకర్, గ్రామ పెద్దలు తదితరులు పాల్గొన్నారు.

No comments:

Post a Comment

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...