Followers

రెవిన్యూ సిబ్బంది పై ఆగ్రహించిన ఎమ్మెల్యే మానుగుంట

 రెవిన్యూ సిబ్బంది పై ఆగ్రహించిన ఎమ్మెల్యే మానుగుంట

పెన్ పవర్,వలేటివారిపాలెం

మండలంలోని చుండి,  అమ్మ పాలెం గ్రామాల్లో రెవిన్యూ భూముల పరిస్థితి సొమ్మోకడిది సోకోకడిది అన్నట్టు ఉంది.  సాధారణంగా తమ భూములను ఆన్ లైన్ చేయించు కోవాలంటే రెవిన్యూ ఆఫీసుల చుట్టూ నెలలు తరబడి తిరిగినా ప్రయోజనం కనిపించదు.  అయితే వలేటివారిపాలెం మండలం లోని చుండి , అమ్మ పాలెం పంచాయితీల్లో మాత్రం సొమ్మోకడిది సోకోకడిది అన్నట్టు కనిపిస్తుంది. భూ యజమానికి తెలియకుండానే ఆన్ లైన్ లో ఎంచక్కా ఎక్కించుకున్నారు.  వివరాల్లోకి వెళితే కందుకూరు శాసనసభ్యులు మానుగుంట మహీధర్ రెడ్డి శుక్రవారం తహశీల్దార్ కార్యాలయంలో ప్రజాసమస్యలపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా తమ భూములను తమ పేర్లమీద కాకుండా మరొకరి పేరు మీద ఆన్ లైన్ చేసి ఉందని చుండి, అమ్మ పాలెం పంచాయితీల్లో ని పలువురు రైతులు ఎమ్మెల్యే మానుగుంట మహీధర్ రెడ్డి దృష్టికి తీసుకొచ్చారు. దీంతో వెంటనే స్పందించిన ఎమ్మెల్యే  రైతు సమస్యలపై  అధికారులను ఆరా తీశారు. చుండి గ్రామంలో 630 ఆఖరి సర్వే నెంబరైతే, 718-1 సర్వే నెంబర్ ఎలా వచ్చిందని కంప్యూటర్ ఆపరేటర్ పై ఆంగ్రహం వ్యక్తం చేశారు. ఈవిధంగా ఆన్లైన్ ఎలా జరిగిందని ప్రశ్నించారు.  దీంతో  కంప్యూటర్ ఆపరేటర్ నుండి ఎలాంటి సమాధానం రాకపోవడంతో ఎమ్మెల్యే అధికారుల పనితీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు‌.   తహశీల్దార్ సంతకం లేకుండా ఆన్లైన్లో భూములు ఎలా చేస్తున్నారని అన్నారు. రిజిస్ట్రేషన్ పత్రాలు లేకుండా తల్లి, తండ్రి బతికుండగానే పార్టిషన్ లేకుండా మరొక పేరు పై ఎలా ఆన్లైన్ చేస్తారన్నారు. ఒకరి భూమి మరోకరిపై అనువంశికం ఎలా మారుతుందో చెప్పాలన్నారు.   చుండి పంచాయతీ లో  90 ఎకరాల భూమిని ఇతర గ్రామాల్లో ని వ్యక్తులకు ఆన్ లైన్ చేసినట్లు అమ్మ పాలెం వైసీపీ పార్టీ నాయకులు వరికూటి సంజీవరెడ్డి ఎమ్మెల్యే మానుగుంట మహీధర్ రెడ్డి దృష్టికి తెచ్చారు.  నలదలపూరు గ్రామం లో ఎఫ్ ఎల్ ఆర్ రికార్డు ఎందుకు కనబడకుండా పోయిందని ఆ గ్రామ విఆర్ఓ వి ఆర్ ఓ ని ఆరాతీశారు.  పూర్తిస్థాయిలో వివరాలు సేకరించి నలదల పూరు గ్రామ విఆర్ఓ ని  సస్పెండ్ చేయమని తహశీల్దార్ కి చెప్పారు.  లింగసముద్రం మండలం కంటే వలేటివారిపాలెం మండలంలో భారీ స్థాయిలో భూ కుంభకోణం జరిగినట్లు తెలుస్తోందన్నారు.  భూ యజమాని ఒకరైతే ఆన్లైన్లో మరొకరు ఎలా ఉంటున్నారు. కంప్యూటర్ ఆపరేటర్ తన తీరు మార్చుకోకపోతే కఠిన చర్యలు తీసుకోక తప్పదని అన్నారు. మండలంలో వందల ఎకరాలు ప్రభుత్వ భూములన తమ ఇష్టం వచ్చినట్లు ఆన్ లైన్ చేసి చాలా రికార్డులు తారు మారు చేశారన్నారు. ఇంత జరుగుతున్నా రెవిన్యూ సిబ్బంది ఎందుకు చర్యలు తీసుకోవడం లేదో అర్థం కాకుండా చేశారని తెలిపారు.  ప్రభుత్వ భూములను ఆక్రమించి ఆన్లైన్ లోకి ఎక్కించుకున్న వారిపై కేసులు నమోదు చేయాలని తెలిపారు. సోమవారం నాటికి  వచ్చిన ఆన్ లైన్ ఫిర్యాదలకీ సంబంధించిన ఆధారాలను తహశీల్దార్ గారికి అందజేయాలని కంప్యూటర్ ఆపరేటర్ ని చెప్పారు.

No comments:

Post a Comment

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...