ప్రమాణ స్వీకారం చేసిన నూతన కార్యవర్గం
కూకట్ పల్లి, పెన్ పవర్
ఇటీవల జరిగిన కూకట్ పల్లి కోర్టు ఎన్నికలలో గెలుపొందిన నూతన కార్యవర్గం సోమవారం కోర్టు ఆవరణలో ప్రమాణ స్వీకారం చేశారు. కోర్టు బార్ అసోసియేషన్ అధ్యక్షుడిగా రాజేశ్వర్ రెడ్డి, ఉపాధ్యక్షుడిగా శాయేశ్వరా శర్మ, ప్రధాన కార్యదర్శిగా విజయశేఖర్ బాబు, జాయింట్ సెక్రటరీగా ఆదిత్యకుమార్, కోశాధికారిగా నటరాజ్, లైబ్రరీ సెక్రెటరీగా లత, స్పోర్ట్స్ సెక్రటరీగా భీమయ్య, కార్యవర్గ సభ్యులుగా శ్రీలత, శివప్రసాద్ గౌడ్, రాణి, సురేష్, రమేష్, కరుణ, దేవిధాస్ లు ప్రమాణ స్వీకారం చేశారు. ఈసందర్భంగా నూతన అధ్యక్షుడు రాజేశ్వర్ మాట్లాడుతూ న్యాయవాదులకు అండగా ఉంటూ వారి సమస్యలను పరిష్కరించే విధంగా కృషి చేస్తానని, నూతనంగా నిర్మిస్తున్న కోర్టు పనులు తొందరగా సాగేందుకు ప్రయత్నిస్తానని తెలిపారు. జరిగిన ఎన్నికలలో అధికారులుగా విధులు నిర్వహించిన సుభాష్ గుప్తా, కాసిమ్ రాజ్, ప్రశాంత్ కుమార్ లు ఎన్నికల్లో గెలుపొందిన వారికి సర్టిపికెట్లను అందజేశారు.


No comments:
Post a Comment