నేలకొండపల్లి భీమ్ దీక్ష కార్యక్రమాన్ని టిజిపిఎ జెండా ఊపి ప్రారంభించారు
పెన్ పవర్,మరిపెడ
బద్రాది కొత్తగూడెం
జిల్లా నేలకొండపల్లి లో జరిగే భీమ్ దీక్షలను విజయవంతం చేయాలని తెలంగాణ గురుకుల పేరెంట్స్ అసోసియేషన్ (టిజిపిఎ) భద్రాద్రి జోన్ కార్యదర్శి ఐనాల పరశురాములు అన్నారు. సోమవారం మరిపెడ మున్సిపాలిటీ కేంద్రంలో జండా ఊపి వాహనాలను ప్రారంభించిన అనంతరం ఆయన మాట్లాడుతూ జ్ఞాన సమాజ నిర్మాణానికి భీమ్ దీక్షలు చేస్తున్నట్లు అక్షరం, ఆరోగ్యం, ఆర్ధికమె లక్ష్యం గా జరిగే కార్యక్రమాలను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో టిజిపిఎ అనుబంధ మహిళ జిల్లా అధ్యక్షురాలు తోట సుజాత,టిజిపిఎ జిల్లా ఉపాధ్యక్షులు కొండ్రు పరశురాములు, ఇమ్మడి వెంకటేశ్వర్లు, జిల్లా సహాయ కార్యదర్శి మాంకాళి గౌతమ్,టిజిపిఎ సోషల్ మీడియా జిల్లా కన్వీనర్ జిన్నా పవన్ కుమార్, అనుబంధ మహిళ జిల్లా సహాయకార్యదర్శి చిత్రాల శిరీష, టిజిపిఎ మరిపెడ మండల అధ్యక్ష, కార్యదర్శులు చింత వెంకన్న, ఐనాల వెంకన్న, నాయకులు మిడతపల్లి జగన్, జిన్నా అప్పయ్య, జినక సైదులు, జయమ్మ, బూబా, తదితరులు పాల్గొన్నారు.

No comments:
Post a Comment