వైయస్సార్ సిపి పార్టీ పుట్టుకతోనే హిస్టరీ క్రియేట్ చేసిన పార్టీగా చెప్పుకోవచ్చని అనకాపల్లి పార్లమెంటు సభ్యురాలు డాక్టర్ బీసెట్టి వెంకట సత్యవతి పేర్కొన్నారు. వైయస్సార్ సిపి పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని శుక్రవారం ఎమ్మెల్యే కార్యాలయంలో నిర్వహించారు. ఈ సందర్భంగా పాల్గొన్న ఆమె మాట్లాడుతూ 151 స్థానాల్లో 2019 ఎన్నికల్లో గెలుచుకొని హిస్టరీ క్రియేట్ చేసిన సీఎంగా జగన్మోహన్రెడ్డి నిలిచారన్నారు. మేనిఫెస్టోను పవిత్ర గ్రంధాలు గా భావించి అనతికాలంలోనే ఇచ్చిన హామీలు నెరవేర్చిన నాయకుడిగా ఖ్యాతి గడించారానారు. దివంగత వైయస్ రాజశేఖర్ రెడ్డి తనయుడుగా పార్టీ ను నడిపించడమే కాకుండా ప్రజా సంక్షేమ నేతగా ప్రజల మన్ననలు అందుకున్న నాయకుడు జగన్మోహన్రెడ్డి అని పేర్కొన్నారు. పార్టీ కోసం శ్రమపడిన కార్యకర్త నాయకులకు తామంతా రుణపడి ఉంటామన్నారు. కార్యక్రమంలో అనకాపల్లి పట్టణ అధ్యక్షుడు మందపాటి జానకి రామ రాజు ,అనకాపల్లి పార్లమెంటు పరిశీలకులు దాడి రత్నాకర్ ,రాష్ట్ర పార్టీ కార్యదర్శి దంతులూరి దిలీప్ కుమార్ , అనకాపల్లి పట్టణ కార్యదర్శి సూరిశెట్టి రమణ అప్పారావు , సకల గోవింద్ , డాక్టర్ విష్ణుమూర్తి ,81వ వార్డు కార్పొరేటర్ అభ్యర్థిని పీలా లక్ష్మీ సౌజన్య ,82 వ వార్డు కార్పొరేటర్ అభ్యర్థిని మందపాటి సునీత , 83 వ వార్డుకార్పొరేటర్ అభ్యర్థిని జాజుల ప్రసన్న లక్ష్మి , 94వ వార్డ్ కార్పొరేటర్ అభ్యర్థిని పలకా యశోద పాల్గొన్నారు.
Followers
Featured Post
కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు
అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...
-
ఎస్ రాయవరంలో వికలాంగు సైకిళ్ల పంపిణీకి గ్రహణం. నాయకుల మధ్య వర్గపోరు పంపిణీకి నోచుకోని వీల్ చైర్స్. ఆరుబయట తుప్పుపట్టి పోతున్న వికలాంగుల సైక...
-
అర్హులైన అందరికీ వ్యాక్సిన్. సంతబొమ్మాళి, పెన్ పవర్. కరోనా సెకండ్ వేవ్ విలయతాండవం చేస్తున్న నేపథ్యంలో ప్రభుత్వ ఆదేశాల మేరకు 45 సంవత్సరాలు...
-
గ్రామాల్లో కరోనా నివారణ చర్యలు. సంతబొమ్మాలి, పెన్ పవర్ మండలంలోని పలు గ్రామాలలో శుక్రవారం ప్రజాప్రతినిధుల ఆధ్వర్యంలో అధికారులు కరోనా నివారణ చ...

No comments:
Post a Comment