Followers

జర్నలిస్టులకు అండగా ఉంటా...ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు

 జర్నలిస్టులకు అండగా ఉంటా...ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు

పెన్ పవర్,మల్కాజిగిరి 

ప్రతి జర్నలిస్టులకు అండగా ఉంటానని మల్కాజిగిరి ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు అన్నారు. ఇటీవల ప్రమాదవశుత్తు జారిపడి మోకాలికి గాయమై నడవలేని స్థితిలో ఉన్న గౌతంనగర్ సాక్షి విలేకరి అబ్థుల్ రెహమాన్ మౌలాలి శ్రామికనగర్ లోని రెహమాన్ నివాసంలో ఎమ్మెల్యే పరామార్శించారు. జర్నలిస్టుల సంక్షేమానికి తెలంగాణ ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. జర్నలిస్టులు ఎదుర్కొంటున్న సమస్యలు అడిగి తెలుసుకున్నారు. హెల్త్ కార్డుల విషయంపై ఆరా తీశారు. తన సొంతంగా జర్నలిస్టులకు హెల్త్ కార్డులు ఇచ్చే విధంగా కృషి చేస్తాన్నారు. మల్కాజిగిరి నియోజకవర్గంలోని జర్నలిస్టులందరికి సొంత ఇండ్ల స్థలాలు ఇచ్చే విధంగా చర్చిస్తామన్నారు. రెహమాన్ కు వ్యక్తిగతంగా ఆర్ధిక సహాయాన్ని ప్రకటించారు. ఈ కార్యక్రమంలో మల్కాజిగిరి సర్కిల్ టిఆర్ఎస్ అధక్ష్యులు, ప్రదాన కార్యదర్శులు పిట్ల శ్రీనివాస్, జి.ఎన్.వి. సతీష్ కుమార్, నాయకులు ఇబ్రహీం, జర్నలిస్టు మిత్రులు బాల్ రాజ్, వెంకటేష్, శ్రీనివాస్ స్వామి, సుబ్బారావు, అక్కల రాజుగౌడ్, క్రిష్ణమూర్తి, నాయుడు, లక్ష్మారెడ్డి, దాస్ తదితరులు ఉన్నారు.

No comments:

Post a Comment

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...