శ్రీ శారదాపీఠం ఉత్తరాధికారి శ్రీ స్వాత్మానందేంద్ర సరస్వతి స్వామి రాకతో పులకించిన అనపర్తి భక్తజనం
అనపర్తి, పెన్ పవర్
విశాఖ శ్రీ శారదా పీఠం ఉత్తరాధికారి శ్రీ స్వాత్మానందేంద్ర సరస్వతి స్వామి బుధవారం అనపర్తి విచ్చేశారు. స్వామివారి దర్శనం తో అనపర్తి భక్తజనం భక్తి పారవశ్యంతో పులకించిపోయారు. స్వామి వారు తొలుత స్థానిక శాసనసభ్యులు డాక్టర్ సత్తి సూర్యనారాయణ రెడ్డి గృహానికి విచ్చేశారు. ఈ సందర్భంగా స్వామివారికి పూర్ణకుంభంతో స్వాగతంచి సూర్యనారాయణరెడ్డి,ఆదిలక్ష్మి దంపతులు పీఠం పారంపర్య పాదుకులకు పూజ గావించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే దంపతులతో పాటు వారి కుమారుడు డాక్టర్ గౌతమ్ రెడ్డి, ప్రియాంక దంపతులు, వారి బంధు జనం స్వామివారి ఆశీస్సులు అందుకున్నారు. ఎమ్మెల్యే గృహం నుండి స్థానిక దేవి చౌక్ సెంటర్ వరకు ఏర్పాటుచేసిన పూల మార్గంపై స్వామి వారు పాదయాత్ర చేశారు. భక్తజనం వెంటరాగా దేవీచౌక్ నుండి వాహనంలో బయల్దేరి స్థానిక అయ్యప్ప స్వామి వారి ఆలయానికి చేరుకున్నారు. ఆలయ ప్రాంగణంలో స్వామివారు స్వహస్తాలతో మొక్కలు నాటి అయ్యప్ప స్వామివారి దర్శనం చేసుకుని మంగళ హారతి సమర్పించారు. ఈ సందర్భంగా స్వాత్మానందేంద్ర సరస్వతి భక్తులను ఉద్దేశించి మాట్లాడుతూ అయ్యప్ప స్వామి వారి ఆలయం ఆంధ్ర ప్రదేశ్ లో మొదటి గొల్లపూడి అని రెండవది అనపర్తి అని ఈ ఆలయం ప్రతిష్టించిన సమయము అత్యంత శక్తివంతమైనది , అనపర్తి అయ్యప్ప స్వామి పూర్తి మహిమాన్వితుడని, ఆలయంలో అత్యంత శక్తి నిఘూడంగా ఉందని పేర్కొన్నారు. అనంతరం భక్తజనులకు మంగళా శాసనాలు చేసిన స్వాత్మానందేంద్ర సరస్వతి స్వామి ప్రముఖ పుణ్యక్షేత్రమైన ద్రాక్షారామం పయనమయ్యారు.

No comments:
Post a Comment