Followers

వైయస్సార్సీపి విజయం ఊహించని రీతిలో టీడీపీకి ప్రజా స్పందన

వైయస్సార్సీపి విజయం ఊహించని రీతిలో టీడీపీకి ప్రజా స్పందన

మహారాణి పేట, పెన్ పవర్

వైసిపి ప్రభుత్వము పేద ప్రజల సంక్షేమం కోసం నవరత్నాలు పేరుతో  అనేక సంక్షేమ పథకాలను ప్రభుత్వం ప్రకటించింది. అర్హులైన లబ్ధిదారులను గుర్తించి ఆ పధకములలో ప్రజలను భాగస్వాముల చేయుటలో  ప్రభుత్వ యంత్రాంగం విఫలం అయినది. గ్రామ స్వరాజ్యమే నిజమైన స్వరాజ్యం అని మహాత్ముడు సూచించిన మార్గంలో ముఖ్యమంత్రి జగన్ గ్రామ, వార్డు స్థాయిలో వాలంటరీ వ్యవస్థ ను ఏర్పాటు చేశారు.ఈ వ్యవస్థ నుంచి ఆశించిన సత్ఫలితాలు  విశాఖ ఎన్నికలలో  కానరాలేదు.ప్రభుత్వ పథకాల ఆవశ్యకతను ,అర్థమైన రీతిలో ప్రజల వద్దకు చేర్చుట లో ప్రజా ప్రతినిధులు, మంత్రులు, శాసనసభ్యులు,నగర ,వీధి స్థాయి నాయకులు అధికార యంత్రాంగం విఫలం అయినారు.మంత్రి అవంతి ప్రాతినిధ్యం వహిస్తున్న భీమిలి నియోజకవర్గ పరిధిలో 9 డివిజన్లకు గాను  ఐదు చోట్ల టీడీపీ భారీ విజయం నమోదు చేసుకుంది.మంత్రి కుమార్తె పోటీచేసిన 6వ వార్డు పరిధిలో వారికి మూడు అంకెల మెజారిటీ నే వచ్చింది .6వ వార్డులో గత సంవత్సరంగా ఓటర్లను ఆకట్టుకొనుటకు మంత్రి గారి కుటుంబ సభ్యులు అనేక రకాల ప్రయత్నాలు చేశారు. అధికార యంత్రాంగం, వాలంటీర్లు, పార్టీ నాయకులు ,కార్యకర్తలు ,కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టిన మూడంకెల మెజారిటీ దాటలేదు.ప్రభుత్వ పథకాలను ప్రజలకు చేరువ చేయుటలో అందరూ విఫలం అయినారు. భీమిలి నగర నడిబొడ్డున మంత్రిగారి కార్యాలయం సమీపంలో పోటీ చేసిన టీడీపీ అభ్యర్థికి 2960 ఓట్ల భారీ మెజారిటీతో ప్రజలు విజయం కట్టబెట్టారు.డబ్బే ఎన్నికలలో  ముఖ్యమని భావించారు. ప్రభుత్వ పథకాలు అమ్మ ఒడి,విద్యార్థుల ఫీజు రియంబర్స్మెంట్, వైయస్సార్ రైతు పథకం, వైఎస్సార్ ఆరోగ్యశ్రీ పథకం,దివ్యాంగుల, వితంతువులకు, ఒంటరి మహిళ పెంచిన పెన్షన్ల పై అవగాహన కల్పించలేకపోయారు.స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ లో కేంద్రమునకు  రాష్ట్ర ప్రభుత్వం సిఫార్సు చేసినట్లు  ప్రజలు  ప్రగాడంగా నమ్మారు .నాయకులందరూ టిడిపి నాయకులను విమర్శించడానికి సమయమును కేటాయించారు .ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలపై  ప్రజలకు అవగాహన కల్పించలేకపోయారు.విశాఖ అభివృద్ధికి  ఏ మాత్రం శ్రద్ధ చూపలేదు.నాయకులు ,పోలీసుల అండదండలతో భూకబ్జాలు, రౌడీయిజం ను పెరిగాయి. యువతకు ఉపాధి కల్పన లో విఫలం అయినారు. అవగాహన లేని  సచివాలయ సిబ్బంది , వాలంటీర్ వ్యవస్థలను పూర్తి శిక్షణ ఇచ్చి తీర్చిదిద్దాలి.పెరిగిన నిత్యావసర ధరలను,లంచగొండితనం,రూపు మాపాలి.మహిళల రక్షణ  కోసం ప్రవేశపెట్టిన దిశ పోలీస్ స్టేషన్ల సేవలను విస్తృతం చేయాలి.ప్రజల పైన పన్నుల భారం తగ్గించాలి.రాష్ట్ర అభివృద్ధి కోసం, ప్రజా సంక్షేమం కోసమే ప్రభుత్వము పని చెయ్యాలి.ప్రజల విశ్వాసం పొందిన నాడే  ఇంకా రెండు దశాబ్దాలు పైగా అధికారంలో ఉండగలుగుతారు.

No comments:

Post a Comment

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...