జనసేన నాయకులు గంటా కృష్ణ దాతృత్వం
తాళ్ళపూడి, పెన్ పవర్తాళ్ళపూడి మండలం తాడిపూడి గ్రామంలో జనసేన పార్టీ తరపున జనసేన నాయకులు మాజీ సర్పంచ్ గంటా కృష్ణ ఆధ్వర్యంలో పట్టిసం వీరభద్రస్వామి దేవాలయ సందర్శనకు వెళ్లే భక్తులకు పులిహోర, మజ్జిగ, వాటర్ పేకెట్లు భారీఎత్తున వితరణ చేయడం జరిగింది. గంటా కృష్ణ దగ్గరుండి యేటిగట్టు మీద వాహనాల మీద వెళ్లే భక్తులకు వాహనాలు అపి దాహార్తి తీర్చడం జరిగింది. గ్రామస్తులకే కాకుండా ఇతర గ్రామాల నుండి వచ్చిన వారికి సహాయ పడటంలో మిన్న అని తాడిపూడి గ్రామస్థులు గంటా కృష్ణ ను కొనియాడారు. ఈ కార్యక్రమంలో బత్తుల సూర్యారావు, గంటా సూర్యచంద్రం, బదిరెడ్డి శ్రీను, వీరిశెట్టి సీతారామయ్య, జనసైనికులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.

No comments:
Post a Comment