కూకట్ పల్లి నియోజకవర్గ ఓబిసి సెల్ చైర్మన్ నియామకం
కూకట్ పల్లి, పెన్ పవర్మూసాపేటకు చెందిన కాంగ్రెస్ నాయకులు తూము సంతోష్ కుమార్ ను కూకట్ పల్లి నియోజకవర్గ ఓబిసి సెల్ చైర్మన్ గా నియమించారు. ఈమేరకు రాష్ట్రఛైర్మన్ వెంకటస్వామి చేతుల మీదుగా సోమవారం గాంధీ భవన్ లో నియామక పత్రాన్ని అందుకున్నారు. ఈసందర్భంగా తూము సంతోష్ కుమార్ మాట్లాడుతూ తన పార్టీకి చేస్తున్న సేవను గుర్తించి ఈ పదవి ఇచ్చిన టీపిసీసి అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్, రాష్ట్ర ఓబీసీ ఛైర్మన్ వెంకటస్వామి, మేడ్చల్ మల్కాజిగిరి చైర్మన్ ఉమేష్ గౌడ్ లకు కృతజ్ఞతలు తెలిపారు. భవిష్యత్తులో పార్టీ బలోపేతానికి కృషి చేస్తూ, మరింత ఉత్సాహంతో పని చేస్తానని అన్నారు.

No comments:
Post a Comment