Followers

సావిత్రిబాయి పూలే సేవలు మరువలేనివి

 సావిత్రిబాయి పూలే సేవలు మరువలేనివి

మందమర్రి, పెన్ పవర్

చదవుల తల్లి సావిత్రిబాయి పూలే దేశానికి, మహిళలకు, బడుగు, బలహీన వర్గాల ప్రజలకు చేసిన సేవలు మరువలేనివని బిజెపి దళిత మోర్చా మందమర్రి పట్టణ అధ్యక్షులు మార్త కుమార స్వామి పేర్కొన్నారు. బుధవారం సావిత్రిబాయి పూలే 124వ వర్ధంతిని పురస్కరించుకొని మందమర్రి పట్టణం యాపల్ ప్రాంతంలోని సింగరేణి డిస్మిస్ కార్మిక సంఘం దీక్షా శిబిరం వద్ద ఆమెకు నివాళులు అర్పించారు. ముందుగా డిస్మిస్ కార్మిక సంఘం మహిళా అధ్యక్షురాలు కొట్ట లక్ష్మి సావిత్రిబాయి పూలే చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం బిజెపి దళిత మోర్చా పట్టణ అధ్యక్షులు మార్త కుమారస్వామి మాట్లాడుతూ, బడుగు, బలహీన వర్గాల ప్రజలు, మహిళల విద్య అభివృద్ధికి పూలే దంపతులు ఎంతగానో కృషి చేశారని పేర్కొన్నారు. సాంఘీక దురాచారాలను రూపుమాపడంలో వీరు అవమానాలు,బెదిరింపులను ఎదుర్కొని పోరాడారని తెలిపారు. ఈ కార్యక్రమంలో బిజెపి రాష్ట్ర నాయకులు రాంటెంకి దుర్గరాజు, జిల్లా కార్యవర్గ సభ్యులు గాజుల ప్రతాప్, దళిత మోర్చా పట్టణ కార్యదర్శి రామ్ కిష్టయ్య, పిట్ట రాజమొగిలి, ఎం భద్రయ్య, తులసీ మదన్, డిస్మిస్ కార్మిక సంఘం నాయకులు బేడబోయిన రవీందర్, పావురాల దుర్గయ్య,దూట లలిత తదితరులు పాల్గొన్నారు.

No comments:

Post a Comment

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...