Followers

బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి కాన్షీరామ్

 బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి కాన్షీరామ్

మందమర్రి,  పెన్ పవర్ 

కాశ్మీరు నుండి కన్యాకుమారి వరకు సైకిల్ యాత్ర చేపట్టి ఎస్సీ, ఎస్సీ, బిసి, మైనార్టీ లను ఏకతాటి పైకి తీసుకు వచ్చిన మహోన్నత వ్యక్తి, బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి కాన్షీరామ్ అని ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం రాష్ట్ర కార్యదర్శి పాత వీరాస్వామి, పట్టణ కన్వీనర్ మొయ్య రాంబాబు లు పేర్కొన్నారు. సోమవారం కాన్షీరామ్ 87 వ జయంతి పురస్కరించుకొని మందమర్రి పట్టణంలోని అంబేద్కర్ విగ్రహం వద్ద కాన్షీరాం జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ముందుగా కాన్షీరాం చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం కేక్ కట్ చేసి, మిఠాయిలు పంచిపెట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, అంబేద్కర్, పూలే ల స్ఫూర్తితో బడుగు, బలహీన వర్గాలకు రాజ్యాధికారమే లక్ష్యంగా పోరాటం చేసిన గొప్ప వ్యక్తి కాన్షీరాం అని కొనియాడారు. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో దళితురాలైన మాయావతిని మూడుసార్లు ముఖ్యమంత్రి చేసిన ఘనత ఆయనదేనని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో యువజన సంఘం పట్టణ కో కన్వీనర్లు సకినాల శంకర్, నెరువట్ల శ్రీనివాస్, ఎండీ ఖలీముద్దీన్, నాయకులు చీర్ల సత్యం,బుంగ సురేందర్, అవునూరి పోశం, మార్త కుమారస్వామి, కనకం రవీందర్, నర్సోజి, దాసరి రాజనర్సు, ఉప్పులేటి నరేష్, జూపాక సంపత్, వాసాల సంపత్, మంతెన సుమన్, సంజీవ్ తదితరులు పాల్గొన్నారు.

No comments:

Post a Comment

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...