Followers

మీడియా పై దాడులు తగదు

 మీడియా పై దాడులు తగదు

జర్నలిస్టులకు భద్రత కల్పించాలి

ఆదిలాబాద్,పెన్ పవర్

నిర్మల్ జిల్లా భైంసాలో జర్నలిస్టులపై జరిగిన దాడిని ఖండిస్తూ బోథ్ నియోజకవర్గ ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ఆధ్వర్యంలో బోథ్ తహసీల్దార్ కార్యాలయం ఎదుట నిరసన వ్యక్తం చేసి తహసీల్దార్ కు వినతి పత్రం అందజేశారు . ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ మధ్య కాలంలో జర్నలిస్టులపై  దాడులు పెరిగిపోయాయన్నారు. దాడులను అరికట్టడంలో ప్రభుత్వాలు విఫలమయ్యాయని విమర్శించారు.దాడుల నివారణకు చర్యలు చేపట్టాలన్నారు. జర్నలిస్టులు ప్రజలకు, ప్రభుత్వానికి వారధిగా ఉంటూ సమస్యల పరిష్కారం కోసం పనిచేస్తున్నారని, వారిపైనే దాడులు జరిగితే సామాన్య ప్రజల పరిస్థితి ఏంటని ప్రశ్నించారు.వెంటనే జర్నలిస్టులపై దాడి చేసిన వారిని అరెస్టు చేయడంతో పాటు శిక్షించాలని కోరారు.ఈ కార్యక్రమంలో నియోజకవర్గ ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సభ్యులు పాల్గొన్నారు.

No comments:

Post a Comment

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...