కుంయ్..కుయ్..కుయ్.. వచ్చేసిందోచ్
ఎమ్మెల్యే చొరవ..ఎట్టకేలకు తీరిన ప్రజల చిరకాల కల
వరదయ్యపాలెంలో 108ను ప్రారంభించిన వైసీపీ నాయకులుపెన్ పవర్,వరదయ్యపాలెం
వరదయ్యపాలెం మండల ప్రజలకు శుభవార్త. ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం చొరవతో ప్రజలు చిరకాలంగా ఎదురుచూస్తున్న 108వాహనం వచ్చేసింది. వరదయ్యపాలెం కు మంజూరైన 108 వాహనాన్ని శుక్రవారం స్థానిక ప్రాథమికఆరోగ్యకేంద్రంలో వైద్యాధికారి చంద్రమోహన్ రెడ్డి ఆధ్వర్యంలో వైసీపీ నాయకులు ప్రారంభించారు. ఈ సందర్చంగ వైసీపీ అధ్యక్షుడు దయాకర్ రెడ్డి, మాజీ సర్పంచ్ బొప్పనతిలక్ బాబు మాట్లాడుతూ అటు పర్యాటక కేంద్రం ఉబ్బలమడుగు, కల్కి భగవాన్ ఆశ్రమం,ఇటు తిరుపతి శ్రీకాళహస్తి వంటి పుణ్యక్షేత్రాలకు ప్రధాన మార్గంగా ఉన్న వరదయ్య పాలెంలో ఎక్కువుగాప్రమాదాలు జరుగుతున్నా108 లేకపోవటంతో అమాయక ప్రాణాలు కోల్పోయివారని అన్నారు.గత 10ఏళ్లుగా 108 మంజూరు చేయాలని అధికారులకు ప్రజాప్రతినిధులకు విన్నవించినా పలితం శూన్యమని ఆవేదన వ్యక్తంచేశారు. ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి వైఎస్ఆర్ ఆశయ సాధనలో భాగంగా ప్రతి మండలానికి 108 మంజూరు చేయడంతో ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం సహకారంతో 108 వాహనం ఏర్పాటు చేయడం హర్షణీయం అని అన్నారు. కార్యక్రమంలో రాచర్ల సర్పంచ్ ధనంజయ లు వైసీపీ యువజన అధ్యక్షుడు వినోద్ యాదవ్, మైనారిటీ కన్వీనర్ అబ్దుల్, హాస్పిటల్ స్టాఫ్, నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

No comments:
Post a Comment