Followers

అన్నదాతలు ప్రకృతి వ్యవసాయంపై మక్కువ చూపాలి

 అన్నదాతలు ప్రకృతి వ్యవసాయంపై మక్కువ చూపాలి

పెన్ పవర్,ఆలమూరు 

  అన్నదాతలు ప్రకృతి వ్యవసాయంపై ఎక్కువ శ్రద్ధ చూపాలని ఆలమూరు సబ్ డివిజన్ వ్యవసాయశాఖ ఏడీఏ సీహెచ్ కెవి చౌదరి అన్నారు. బుదవారం ఆలమూరు మండలం మోదుకూరు గ్రామంలో పొలంబడి కార్యక్రమం ఆలమూరు మండల వ్యవసాయ అధికారిణి సోమిరెడ్డి లక్ష్మి లావణ్యతో కలిసి నిర్వహించారు. ఈ కార్యక్రమం యొక్క ఉపయోగం ఏ విధంగా ఉన్నదాని రైతులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ప్రతి రైతు కుటుంబానికి సరిపడా వరి, కూరగాయలు ప్రకృతి వ్యవసాయం విధానంలో పండించుకుని తినడం ద్వారా ఏ విధమైనటువంటి లాభాలు ఉంటాయో తెలిపారు. అగ్గి తెగులు, మాని పండు తెగులు పంటలపై ఏవిధంగా సౌకుతుందో వాటి నివారణ చర్యలు రైతులకు వివరించారు. అలాగే మిత్ర పురుగుల గురించి వివరిస్తూ చిత్ర పటాలు ద్వారా చూపించి అవి ఏవిధంగా శత్రు పురుగులను నాశనం చేస్తాయో తెలియజేశారు. అనంతరం వాటర్ హోల్డింగ్ కెపాసిటీ గురించి వివరిస్తూ, మూడు రకాల నేలలలో ఏ విధంగా నీటిని పట్టి ఉంచుతుంది అనేది తెలిపారు. అనంతరం ప్రతి రైతు దాళ్వా వరి అనంతరం చేను తగలబెడం వలన అనేక అనర్థాలు కలుగుతాయని అన్నారు. అలాగే 200 లీటర్ల నీటిలో రెండు కేజీల బెల్లం కలిపి డీకంపోజర్ ను దానిలో కలిపి ప్రతి రోజు ఉదయం సాయంత్రం కలుపుతూ నాలుగు నుంచి ఏడు రోజుల పాటు చేస్తే మంచి ద్రావణం తయారవుతుందని, వాటిని ప్రకృతి వ్యవసాయంలోని ఆకులను, ఎండు గడ్డిని కుళ్ళబెట్టడానికి ఉపయోగించవచ్చని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఆయా గ్రామాల వ్యవసాయ సహాయకులు తోపాటు పలువురు రైతులు పాల్గొన్నారు.

No comments:

Post a Comment

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...