ముంగర మడుగు పంచాయతీ లో పర్యటించిన పూతలపట్టు ఎమ్మెల్యే .ఎం.ఎస్.బాబు
బంగారుపాళ్యం, పెన్ పవర్
బంగారుపాళ్యం మండలం కార్యక్రమంలో భాగంగా మొదటగా ప్రాథమిక పాఠశాల లో విద్యార్థులకు పుస్తకాలు పంపిణీ చేశారు. అనంతరం ఆ గ్రామం నందు డ్రైనేజీ సమస్యను స్వయంగా పర్యవేక్షించి కొత్తగా డ్రైనేజీ పైప్ నిర్మాణము కొరకు పనులను ప్రారంభించాలని కోరారు. అలగే నూతనంగా నిర్మించిన గ్రామ పంచాయతీ భవనమును ప్రారంభించారు మరియు వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరాన్ని పరిశీలించారు. ఈ కార్యక్రమంలో మండల కన్వీనర్ రామ చంద్ర రెడ్డి గారు, రాష్ట్ర వైఎస్ఆర్ సిపి నాయకులు ,జిల్లా నాయకులు మరియు మండల నాయకులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment