Followers

రక్త దానానికి యువకులు ముందుకు రావాలి

రక్త దానానికి యువకులు ముందుకు రావాలి

మందమర్రి, పెన్ పవర్

రక్తదానంపై అపోహలు వీడి యువకులు స్వచ్ఛందంగా రక్తదానం చేయడానికి ముందుకు రావాలని ఎంపీటీసీ సూపరింటెండెంట్ ఇంజనీర్ అశోక్ పేర్కొన్నారు. శుక్రవారం మందమర్రి ఏరియాలోని గనుల వృత్తి శిక్షణ కేంద్రం (ఎంవిటిసి) లో శిక్షణ పొందుతున్న నూతన కార్మికులకు రక్తదానం, తలసేమియా, సికిల్ సెల్ వ్యాధులపై అవగాహన సదస్సును నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఎంవిటిసి లో శనివారం ఉదయం 9 గంటల నుండి రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరిగిందని ఆయన తెలిపారు. కారుణ్య నియామకాల ద్వారా శిక్షణ పొందిన ప్రతి ఒక్కరు రక్తదానం చేయాలని ఆయన కోరారు. ఆరోగ్యవంతమైన ప్రతి వ్యక్తి ప్రతి మూడు నెలలకు ఒకసారి రక్త దానం చేయవచ్చునని ఆయన పేర్కొన్నారు. దేశంలో రోజురోజుకు తలసేమియా, సికిల్ సెల్ వ్యాధిగ్రస్తుల సంఖ్య పెరిగిపోతోందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. తలసేమియా, సికిల్ సెల్ లాంటి వ్యాధులను నివారించేందుకు యువతీయువకులు వివాహానికి ముందే రక్త పరీక్షలు చేయించుకోవాలని ఆయన సూచించారు. రక్తదాన శిబిరం ద్వారా సేకరించిన రక్తాన్ని మంచిర్యాల ప్రభుత్వ ఆసుపత్రిలోని నిరుపేద రోగులకు, తలసేమియా, సికిల్ సెల్ వ్యాధిగ్రస్తులకు, రోడ్డు ప్రమాద భాదితులకు, కిడ్నీ, క్యాన్సర్ లాంటి వ్యాధిగ్రస్తులకు రెడ్ క్రాస్ సొసైటీ ద్వారా ఉచితంగా రక్తాన్ని అందించడం జరుగుతుందని వివరించారు. ఏరియాలోని సింగరేణి కార్మికులు రక్తదాన శిబిరంలో పాలుపంచుకొని విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ మేనేజర్ కృష్ణారావు, హెడ్ ఓవర్ మెన్స్ రాజేశం, సాగర్ లక్ష్మణ్, సతీష్,రెడ్ క్రాస్ జిల్లా కమిటీ సభ్యులు కాసర్ల శ్రీనివాస్, బెల్లంపల్లి డివిజన్ సభ్యులు సూరం లక్ష్మీనారాయణ, తలసేమియా వెల్ఫేర్ సొసైటీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి కాసర్ల రంజిత్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. 

No comments:

Post a Comment

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...