14న ఓట్ల లెక్కింపు
పెన్ పవర్,పెద్దాపురం
మునిసిపల్ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియను కౌటింగ్ అధికారులు సిబ్బంది విజయవంతం చేయాలని అసిస్టెంట్ ఎలెక్షన్ అథారిటీ అధికారి మరియు మునిసిపల్ కమిషనర్ జి. సురేంద్ర కోరారు. శుక్రవారం స్థానిక మునిసిపల్ కార్యాలయ కౌన్సిల్ సమావేశ మందిరంలో ఈ నెల14 వ తేదీన స్థానిక ఆర్డీవో కార్యాలయంలో నిర్వహిస్తున్న మునిసిపల్ ఓట్ల లెక్కింపుకు కేటాయించిన ఎలెక్షన్ అధికారులు, అసిస్టెంట్ ఎలెక్షన్ అధికారులు మరియు కౌటింగ్ సిబ్బంది తో మున్సిపల్ కమిషనర్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతి జరిగింది.
ఈ శిక్షణ తరగతిలో కమిషనర్ మాట్లాడుతూ 14 వ తేదీన ఉదయం8 గంటలకు ఓట్ల లెక్కింపు ప్రారంభిస్తారని తెలిపారు. ఓట్ల లెక్కింపుకు 24 మంది అధికారులను నియమించిన ట్లు చెప్పారు. వీరిలో 8 మంది ఎలెక్షన్ అధికారులు 8మందిఅసిస్టెంట్ ఎలెక్షన్ అధికారులు,మరో 8 మంది ఆదనపు అధికారులు వున్నారని తెలిపారు.36 మంది కౌంటింగ్ సిబ్బంది, ఉన్నారని చెప్పారు. ఓట్ల లెక్కింపు 8 రౌండ్లు ద్వారా లెక్కింపు జరుగుతుందని, మొత్తం 4 రౌండ్లలలో లెక్కింపు పూర్తి అవుతుందని వివరించారు. కౌటింగ్ అధికారులకు ,సిబ్బందికి ఫొటోతో కూడిన గుర్తింపు కార్డులు జారిచేస్తామని తెలిపారు. కౌటింగ్ అదికారులు, సిబ్బంది ఉదయం 6 గంటల కల్లా కౌటింగ్ కేంద్రానికి చేరుకోవాలని అన్నారు.కౌటింగ్ కేంద్రానికి మొబైల్ ఫోన్లు, సాంకేతిక పరమైన ఎటువంటి పరికరాలు అనుమతి లేదనిఅన్నారు.పోస్టల్ బ్యాల్లెట్స్ ఓట్లు, బ్యాలెట్ బాక్సలు ఓపెన్ చేసే విధానం , ఏజెంట్లు గుర్తింపు కార్డులు, బ్యాలెట్ పేపర్లు కట్టలు కట్టడం, కౌటింగ్ విధానం, ఫోరమ్ 38 ఫారం, ఫైనల్ రిజల్ట్ ప్ షీట్ తదితర అంశాలపై కమిషనర్ వివరించడం జరిగింది. కౌటింగ్ సరళి వీడియో గ్రాఫి పర్యవేక్షణ లో ఉంటుందని, కౌటింగ్ కేంద్రం వద్ద బారి పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేసామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎలెక్షన్ అధికారులు, సిబ్బంది, మునిసిపల్ టిపిఓ ఉమామహేశ్వరరావు, మేనేజర్ నాగేశ్వరరావు, శానిటేషన్ ఇన్స్పెక్టర్ దావిదు రాజు , మునిసిపల్ సిబ్బంది,తదితరులు పాల్గొన్నారు.


No comments:
Post a Comment