Followers

పెద్దాపురం డివిజిన్ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలకు సర్వం సిద్ధం

 పెద్దాపురం డివిజిన్ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలకు సర్వం సిద్ధం

   పెద్దాపురం,పెన్ పవర్

పెద్దాపురం డివిజిన్ పరిధిలో ఈ నెల 14 వ తేదీన జరుగు ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ కు సర్వం సిద్ధం చేసామని ఆర్డీవో ఎస్. మల్లిబాబు తెలిపారు. శుక్రవారం  స్థానిక ఆర్డీఓ కార్యాలయంలో పాత్రికేయులతో మాట్లాడుతూ ఆదివారం జరుగు పోలింగ్ సిబ్బందికి పోలింగ్ మెటీరియల్ ను శనివారం పంపిణీ చేయడానికి ఆర్డీవో ఆఫీసులో డివిజిన్ స్థాయి డిస్ట్రిబ్యూషన్ సెంటర్ ను ఏర్పాటు చేశామని  తెలిపారు.పెద్దాపురం డివిజిన్ లో 12 మండలకు 1039 మంది ఉపాద్యాయులు  తమ ఓటు హక్కు వినియోగించుకుంటారని తెలిపారు. 14 వ తేదీన ఉదయం 8 గంటల కు పోలింగ్ ప్రారంభించి, మధ్యాహ్నం 4గంటలకు  ముగిస్తుందని చెప్పారు. ప్రతీ మండల కేంద్రం     ఎంపీడీఓ ఆఫీసునందు,పోలింగ్ కేంద్రం  రంగంపేట మండలం తహసీల్దార్ ఆఫీస్ నందు ఎర్పాటు చేశామని తెలిపారు. మండలాలవారిగా ఉపాద్యాయ ఓటర్లు జగ్గంపేట కేంద్రంలో 64  మంది,ఏలేశ్వరం  116, ప్రత్తిపాడు 73,శంఖవరం 54, రౌతులపూడి 59, కోటనం దూర్ 29, తుని 241, తొండంగి 49 , కిర్లంపూడి 87, పెద్దాపురం 219, గండేపల్లి 27, రంగంపేట 21మంది ఉపాద్యాయులు ఓటరు గా నమోదు చేసుకున్నారని తెలిపారు. పోలింగ్ డిస్ట్రిబ్యూషన్ సెంటర్  షామియనాలతో ఏర్పాటు చేశామని, మండలాలవారీగా టేబుల్స్ ,కుర్చిలు ఏర్పాటు చేశామని, సమాచార కేంద్రం, డ్రికింగ్ వాటర్, వాహనాల పార్కింగ్ తదితర అన్ని ఏర్పాట్లు చేసామని,ప్రత్యేకమైన బస్సు లో పోలింగ్ సిబ్బంది ని, మెటీరియల్ తో మండలకు పంపడం జరుగు తుందిని తెలిపారు. కోవిడ్-19 అనుసరించి మాస్కులు ధరించుట, శానిటేజర్ ఉపయోగింస్తున్నామని తెలిపారు.

No comments:

Post a Comment

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...