బైంసా అల్లర్లకు, నాలుగేళ్ల పాప పై జరిగిన అత్యాచారం ఘటనపై న్యాయ విచారణ చేపట్టాలి...
* కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు సాజిద్ ఖాన్
*జిల్లా కలెక్టర్ కు వినతిపత్రం అందజేత
ఆదిలాబాద్ , పెన్ పవర్ఇటీవల నిర్మల్ జిల్లా బైంసా లో జరిగిన అల్లర్లకు కారణమైన వారికి,4 సంవత్సరాల పాప పై జరిగిన అత్యాచార ఘటన లపై తొందరగా న్యాయ విచారణ జరిపించి నిందితులకు శిక్ష పడేవిధంగా చూడాలని కోరుతూ బుధవారం ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్ సిక్తపట్నాయక్ కు కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు సాజిద్ ఖాన్ వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో నాగేష్,మల్లేష్ యాదవ్, రాజు యాదవ్ తదితరులు.

No comments:
Post a Comment