టిఆర్ఎస్ పార్టీకి ఒక న్యాయం.. కాంగ్రెస్ ఒక న్యాయమా?
కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు సాజిద్ ఖాన్
టిఆర్ఎస్ అధికారంలో ఉందని ఆ పార్టీ కార్యాలయానికి నిర్మాణం కోసం ఒక ఎకరం కేటాయించారు. పలుమార్లు అధికారుల కార్యాలయం చుట్టూ తిరుగుతున్న అప్పటి కాంగ్రెస్ పార్టీకి ఇప్పటివరకు కాంగ్రెస్ పార్టీ కార్యాలయం కోసం భూమి కేటాయించకపోవడం శోచనీయమని, అధికారంలో ఉన్న టిఆర్ఎస్ పార్టీకి ఒక న్యాయం కాంగ్రెస్ ఒక న్యాయమా? అని కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు సాజిద్ ఖాన్ మండిపడ్డారు. బుధవారం జిల్లా కేంద్రంలోని జడ్పీ కార్యాలయం లో జడ్పీ చైర్మన్ జనార్ధన్ రాథోడ్ ను కలిసి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత కొన్ని నెలలుగా కాంగ్రెస్ పార్టీ కార్యాలయం స్థలం కోసం కలెక్టర్,అధికారుల చుట్టూ తిరుగున్న ఎలాంటి స్పందన లేకపోవడం తో ఈ రోజు జిల్లా పరిషత్ కార్యాలయం ఎదుట నూతనంగా నిర్మించిన వ్యాపార సముదాయం వేలం పాట లో పాల్గొని రు.16వేలు అద్దె మల్గి ని పొందడం జరిగిందని అన్నారు. పార్టీ కార్యాలయ స్థలం కోసం అధికారుల చుట్టూ ఎన్నిసార్లు తిరిగిన స్పందన లేకపోవడం తో నిరసనగా వేలంపాట లో పొందిన మల్గి లో పార్టీ కార్యాలయాన్ని ఏర్పాటు చేస్తామని తెలిపారు. ఆయన వెంట కాంగ్రెస్ నాయకులు రాహుల్ ఉన్నారు.

No comments:
Post a Comment