Followers

జాతర్లలో ట్రైనీ ఐ ఎ ఎస్ ల పర్యటన

 జాతర్లలో ట్రైనీ ఐ ఎ ఎస్ ల పర్యటన

గుడిహత్నూర్ ,  పెన్ పవర్

 ఆదిలాబాద్ జిల్లా  బజార్  హత్నూర్   మండలంలోని  జాతర్ల  గ్రామాన్ని ట్రైనీ ఐఏఎస్ లు కునాల్ అర్వింద్  ప్రతాప్ ( గ్రూప్ లీడర్), శ్రీవాస్తవ,కంటా జంగీర్,సుస్మా నేగి లు మంగళవారం  సందర్శించారు. కాగా  గ్రామంలోని గ్రామపంచాయతీ  ఆఫీస్ లో  వివిధ  డిపార్ట్ మెంట్ల  ఆఫీసర్లతో ఏర్పాటు  చేసిన  మీటింగ్ లో  పాల్గొని గ్రామిణాభివృద్ధి  కోసం  చేపడుతున్న  కార్యక్రమాలను అడిగి  తెలుసుకున్నారు.  ఐసీడీఎస్, స్కూల్స్ , హాస్టల్స్, గ్రామపంచాయతీలలో  రోజువారీగా   జరిగే  ప్రోగ్రామ్స్ లతో  పాటు  వారి విధులను  అడిగి తెలుసుకున్నారు.  ఇక్కడి  సీహెచ్ సీ  సెంటర్ లో   గర్భవతులు, చైల్డ్ ఇమ్యూనైజేషన్, పోష్టికాహార అందజేత లాంటి పథకాలను అడిగి  తెలసుకున్నారు. వీటితో  పాటు  ఇక్కడ  జరుగుతున్న ఆదివాసీ పెళ్లి కార్యక్రమంలో  జరిగే ఆచార,వ్యవహరాలను ప్రత్యేకంగా  గ్రామస్థులు  వివరించారు.  వారితో ఎంపీడీఓ దుర్గం శంకర్, తహశీల్దార్ గంగాధర్, ఐసీడీఎస్ సూపర్ వైజర్  లక్ష్మీ, సర్పంచ్ లక్ష్మీబాయి నాగోరావు, ఎంపీటీసి అందె  సుజాత ప్రకాష్,  వివిధ శాఖల ఆఫీసర్లు ఉన్నారు.

No comments:

Post a Comment

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...