30 వ వార్డు ఉప ఎన్నికల్లో టి.ఆర్.ఎస్ పార్టీ అభ్యర్థిని నామినేషన్...
బెల్లంపల్లి , పేన్ పవర్బెల్లంపల్లి పట్టణం పట్టణంలోని 30 వ వార్డ్ లో జరగనున్న మున్సిపల్ ఉప ఎలక్షన్స్ లో తెరాస పార్టీ అభ్యర్ధినిగా సుకేషిని భరద్వాజ్ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య చేతుల మీదుగా నామినేషన్ పత్రాలు స్వీకరించి, ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం నుండి మున్సిపల్ చైర్ పర్సన్ జక్కుల శ్వేత శ్రీధర్ , వైస్ చైర్మన్ సుదర్శన్ ఆధ్వర్యంలో.... పట్టణ కౌన్సిల్ & కో ఆప్షన్ సభ్యుల మద్దతుతో భారీ ర్యాలీగా బయలుదేరి మున్సిపల్ కార్యాలయం నందు ఎలక్షన్స్ అధికారి శ్రీనివాస్ చేతులకు నామినేషన్ పత్రాలు సమర్పించారు. ఈ కార్యక్రమంలో ఎలక్షన్స్ సంబంధిత అధికారులు, పట్టణ తెరాస యువ నాయకులు, తెరాస పార్టీ కార్యకర్తలు, తెరాస పార్టీ అభిమానులు, తదితరులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment