కరోనా కష్టాలు
తాండూర్, పెన్ పవర్
మంచిర్యాల జిల్లా,తాండూర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో కరోనా టెస్ట్ లు చేయించుకునే వారికి, కరోనా టీకా వేయించుకోవడానికి వచ్చే వారికి చాలా ఇబ్బందులు ఎదురవుతున్నాయి. కరోనా ఉదృత్తం అవుతున్న ఈ సమయంలో సంబంధిత అధికారులు కనీస సౌకర్యాలు కూడా కల్పించడం లేదు. నిత్యం అధిక సంఖ్యలో ఆసుపత్రికి వచ్చే వారంతా చెట్ల కింద ఒకే చోటికి చేరుకొని ఉంటున్నారు. ఇలా ఉండే వారిలో టీకా వేయించుకునే వారు , కరోనా టెస్టు చేయించుకునే వారు ఒకే చోటా తెలియకుండానే ఉండటం వల్ల ఎవరి వల్ల కరోనా వస్తుందో అని భయాందోళనకు గురవుతున్నారు. కనీసం ఇప్పటికైనా సంబంధిత అధికారులు వెంటనే స్పందించి నీడ కోసం శామియలు ఏర్పాటు చేయాలి. టీకా కోసం వచ్చే వారికి మరియు టెస్ట్ లు చేయించుకునే వారికి వేరువేరుగా కౌంటర్లు ఏర్పాటు చేసి తగు సూచనలు, సలహాలు తెలియజేసే బోర్డులను ఏర్పాటు చేయగలరని ప్రజలు కోరుతున్నారు.అలాగే నిత్యం ఇద్దరు పోలీసులని నియమించి అందరూ కూడా కోవిడ్ నియమ నిబంధనలు పాటించే విధంగా చర్యలు తీసుకోవాలని తాండూర్ మండల ప్రజలు కోరుకుంటున్నారు.
No comments:
Post a Comment