ప్రభుత్వ సంక్షేమ పథకాలు ప్రజలకు అందే విధంగా పార్టీ నాయకులు కృషి చేయాలి.
పెద్దవంగర మండల టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు ఈదురు అయిలయ్య.
పెద్దవంగర, పెన్ పవర్ప్రభుత్వ సంక్షేమ పథకాలు ప్రజలకు చేరేవరకు కలిసి కట్టుగా పార్టీ నాయకులు పని చేయాలని, మహబూబాద్ జిల్లా పెద్దవంగర మండల టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు ఈదురు అయిలయ్య అన్నారు. శనివారం జరిగిన ముఖ్య కార్యకర్తల సమావేశంలో మాట్లాడుతూ... రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు చేస్తున్న అభివృద్ధి పనులు ప్రజలకు పూర్తిస్థాయిలో వివరించాలని, అన్నారు. అనంతరం మండలంలోని పోచారం గ్రామ టిఆర్ఎస్ నూతన పార్టీ ఇంచార్జి రాసాల సమ్మయ్య అధ్యక్షతన ఏకగ్రీవంగా తెరాస గ్రామ కమిటీని ఎన్నుకున్నారు. గ్రామ పార్టీ అధ్యక్షులుగా కుకంట్ల వీరన్న, ప్రధాన కార్యదర్శిగా మద్దెల సారయ్య, ఉపాధ్యక్షులు గా కాలేరు మల్లయ్యలుగా ఎన్నికైనట్లు ప్రకటించారు.ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ మండల నాయకులు భానోతు వెంకన్న, టిఆర్ఎస్ నాయకులు నూనవత్ బాలు, మండల యూత్ అధ్యక్షుడు కాసాని హరీష్, మండల యూత్ ఉపాధ్యక్షుడు కుకంట్ల యాకన్న, ఉప సర్పంచ్ లక్ష్మినారాయణ, వార్డు సభ్యులు మద్దెల శ్రీను, కుకంట్ల శ్రీశైలం తదితరులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment