Followers

భీమ్ ప్రతిజ్ఞ వారోత్సవాల ను జయప్రదం చేయండి

 భీమ్ ప్రతిజ్ఞ వారోత్సవాలను జయప్రదం చేయండి

 తార్నాక , పెన్ పవర్

సామాజికవిప్లవకారులు మహనీయులు మహాత్మ ఫూలే జయంతి నుండి భారత రాజ్యాంగ పితామహుడు బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి వరకు ఆర్ట్స్ కళాశాల వేదిక గా ఏప్రిల్ 11నుండి 14 వరకు జరిగే "భీమ్ ప్రతిజ్ఞ వారోత్సవ్ " కార్యక్రమం ను జయప్రదం చేయాలని కోరుతూ ఓయూ విద్యార్థులు పిలుపునిచ్చారు.  ఆర్ట్స్ కాలేజ్ ముందు "బీమ్ ప్రతిజ్ఞ వారోత్సవాల" పోస్టర్ ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఓయూ విద్యార్థి నాయకులు  హరీష్ ఆజాద్, మంచాల లింగ స్వామి, కృష్ణ మాదిగ, గడ్డం శ్రీనివాస్ మాట్లాడుతూ బాబాసాహెబ్ అంబేద్కర్ హిందూ మతాన్ని వీడి భౌద్ధము తీసుకునే సమయంలో  చేసిన ప్రమాణాలను మనమూ పాటిస్తూ, ప్రతి ఒక్కరికి తెలియజేస్తూ అసలైన బాబాసాహెబ్ వారసులుగా ముందుకు రావాలని అదేవిధంగా ఈ కార్యక్రమాన్ని రెండు తెలుగు రాష్ట్రాలలో విస్తృతంగా నిర్వహించాలని  పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో గ్యారనరేశ్, నకిరేకంటి నాగరాజు, దివాకర్, సంతోష్, బట్టు, స్వామి మాదిగ, ఉదయ్, క్రాంతి, వెంకన్న ,బాలు, మురళి కృష్ణ, కిషోర్, సాయి తదితరులు పాల్గొన్నారు.

No comments:

Post a Comment

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...