స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా20 కిలో మీటర్లు పాదయాత్ర చేపట్టిన తెలుగుదేశం పార్టీ కార్పొరేటర్లు
గాజువాక, పెన్ పవర్
స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా తెల్లవారుజామున కూర్మన్నపాలెం జంక్షన్ నుండి విశాఖ నగర పాలక సంస్థ వరకు తెలుగుదేశం పార్టీ కార్పొరేటర్ల పాదయాత్ర చేపట్టారు.పాదయాత్రలో భాగంగా తెల్లవారు నాలుగున్నర గంటలకు కూర్మన్నపాలెం జంక్షన్ లో ఉన్న అంబేద్కర్ విగ్రహానికి తెలుగుదేశం పార్టీ కార్పొరేటర్లు పూలమాలవేసి కాగడ వెలిగించి పాదయాత్ర చేపట్టారు.వీరితో పాటు ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ సభ్యులు కూడా సంఘీభావంగా పాదయాత్రలో పాల్గొన్నారు.
కార్పొరేటర్లు మాట్లాడుతూ విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా గాజువాక నియోజకవర్గం నుంచి తెలుగుదేశం కార్పొరేటర్లు ఈరోజు జరగనున్న నగరపాలక సంస్థ కౌన్సిల్ సమావేశానికి పాదయాత్రగా బయలుదేరి కౌన్సిల్ తీర్మానంలో విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ కాకుండా చూడాలని పబ్లిక్ సెక్టర్ గా నడవాలని విశాఖ స్టీల్ ప్లాంట్ కర్మాగారం వేల మందికి అన్నం పెడుతుందని ప్రైవేట్ పరం అయితే కార్మిక కుటుంబాలు అన్యాయం అయిపోతాయని అన్నారు.


No comments:
Post a Comment