Followers

పారిశుద్ధ్య కార్మికుల జీతాల బాకాయిలు వెంటనే చెల్లించాలి

పారిశుద్ధ్య  కార్మికుల జీతాల బాకాయిలు వెంటనే చెల్లించాలి

పరవాడ, పెన్ పవర్

పంచాయతీ పారిశుద్ధ్య కార్మికులకు బకాయి పడ్డ 13 నెలలు జీతాలు చెల్లించాలని మంగళవారం స్థానిక ఎంపీడీవో కార్యాలయం వద్ద సిఐటియు ఆధ్వర్యంలో మండలంలో పారిశుద్ధ్య కార్మికులు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా పంచాయతీ కార్మికుల యూనియన్ జిల్లా గౌరవ అధ్యక్షులు గని శెట్టి సత్యనారాయణ మాట్లాడుతూ గత సవచ్చరం కరోనా మొదలు అయిన దగ్గరనుండి గ్రామాల్లో కరోనా నివారణ కోసం అహర్నిశలు తమ ప్రాణాలను సైతం లెక్కచేయకుండా ప్రజల ప్రాణాల కోసం పనిచేస్తున్న పారిశుద్ధ్య కార్మికులకు,వాటర్ పంప్ ఆపరేటర్లకు,ఎలక్ట్రికల్ వర్కర్స్ లకు ప్లంబర్ లకు మండలంలోని గ్రామపంచాయతీ లలో వారికి 13 నెలలుగా జీతాలు ఇవ్వకుండా బకాయి ఉంటే వారు ఎలా బతకాలని ఆవేదనతో ప్రశ్నించారు.కరోనా మొదలు దగ్గరనుంచి నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్ని అంటాయి అని అలాంటి పరిసితుల్లో వారికి జీతాలు ఇవ్వకపోతే వారు ఎలా బ్రతుకుతారు అని ప్రశ్నించారు.అంతే కాకుండా వారికి రక్షణ కొరకు మాస్కులు, శానిటైజర్,బూట్లు, యూనిఫార్మ్,సబ్బులు లాంటి వేవి ఇవ్వడం లేదని గనిశెట్టి ఆవేదన వ్యక్తం చేశారు.కరోనాతో  మరణించిన వారి  ప్రాంతంలో పారిశుద్ధ్య కార్మికులు అక్కడ శుభ్రత పని చేస్తున్న సమయంలో వారికి మాస్క్ లు లేకపోతే ఏ రకంగా పనులు నిర్వహించగలరు అని ప్రశ్నించారు.వెంటనే బకాయి జీతాలు చెల్లించాలని పిఎఫ్, ఈ ఎస్ ఐ, ఐడి కార్డులు భద్రతా పరికరాలు పంచాయతీల్లో కార్మికులకు ఇవ్వాలని అని గనిశెట్టి డిమాండ్ చేశారు.అనంతరం సమస్యలతో కూడిన వినతి పత్రాన్ని ఈవో.ఆర్ .డి పద్మ గారికి ఇవ్వడమైనది ఈ కార్యక్రమంలో పంచాయతీ వర్కర్స్ యూనియన్ నాయకులు డి.విశాఖ,ఆర్.విజయ,పి. పారుపల్లి,ఎస్.లక్ష్మి తదితరులు పాల్గొన్నారు.

No comments:

Post a Comment

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...