Followers

డా. ఏ.పి.జె అబ్దుల్ కలం కు ఘన నివాళి


డా. ఏ.పి.జె అబ్దుల్ కలం కు ఘన నివాళి


ఆత్రేయపురం,పెన్ పవర్


 


ఆత్రేయపురం మండల పరిషత్ కార్యాలయంలో నిర్వహించిన అబ్దుల్ కలాం నివాళి కలలు కనండి_ వాటిని సాకారం చేసుకోండి అనే మాటను పది మందికి చెప్పడమే కాదు తాను కూడా ఆచరించి,  జీవితాన్ని చరితార్థం చేసుకున్న మహనీయుడు.. భారత మాజీ రాష్ట్రపతి, భారతరత్న డాక్టర్ అబ్దుల్ కలాం అనీ, ఎంత ఎత్తుకు ఎదిగినా.. ఒదిగే ఉండాలన్న సందేశాన్ని చేతల్లో చూపిస్తూ.. ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న ఈ తరం గొప్ప వ్యక్తి  మిస్సైల్ మ్యాన్ అబ్దుల్ కలాం  అంటూ ఆత్రేయపురం ఎంపీడీఒ నాతి బుజ్జి  కొనియాడారు.  జూలై-27 సోమవారం డా.అబ్దుల్  కలాం వర్ధంతిని పురస్కరించుకుని స్థానిక మండల పరిషత్ కార్యాలయంలో  అబ్దుల్ కలాం చిత్రపటానికి పులమాల వేసి మౌనం పాటించి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో మండల విద్యాశాఖాధికారి వరప్రసాద రావు, పంచాయతీ విస్తరణాదికారి శ్రీనివాస్, మండల పరిషత్ కార్యాలయ పరిపాలనాధికారిణి సుగుణ, కార్యదర్శి గంగూలీ, సమీర్ , ఏపీఎం సునీత తదితరులు పాల్గొన్నారు.


చేసిన వారిపై చర్య







దళిత యువకునికి శిరోముండనం చేసిన వారిపై చర్య తీసుకోండి


 


గోకవరం పెన్ పవర్


 

సీతానగరం పోలీసు స్టేషను లో దళిత యువకునికి శిరోమండం చేసి దాడి చేసి అవమానించిన సంఘటనను ఆంద్రప్రదేశ్ రైతు- కూలి సంఘం జిల్లా ప్రదాన కార్యదర్శి బి.రమేష్ తీవ్రంగా ఖండించారు.సోమవారం నాడు ఆయన ఒక ప్రకటన విడుదల చేసారు.దళిత,మైనారిటీ, వెనకబడిన వర్గాలపై దాడులను అరికట్టడంలో కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తిగా విపలమవుతున్నాయని ఆయన విమర్శించారు. ఈ ఘటనకు మూల కారుకుడైనా ఇసుక మాఫియా స్ధానిక అధికార పార్టీ నేత కవల క్రిష్ణ మూర్తిని కేసు నుండి తప్పించే ప్రయత్నాలను ప్రజా ఉద్యమంతో ఎదుర్కొని కవల క్రిష్ణ మూర్తిని అరెస్టు చేసి ఎస్సీ ఎస్టీ అట్రాసిటి కేసు నమోదు చేసేవరకు ప్రజా ఉద్యమం ఆగదని ఆయన ప్రభుత్వాన్ని హెచ్చరించారు.అలాగే చీరాలలో లాక్ డౌన్ పేరుతో దళిత యవకున్ని గాయపర్చి మృతికి కారణమైన స్ధానిక పోలీసు అధికారులపై హత్య కేసు, ఎస్సీ ఎస్టీ అట్రాసిటి కేసు నమోదు చేసి శిక్షించాలని ఆయన ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేసారు


 

 




 

 



 



 



రాజుపేటలో నూతన గ్రామ సచివాలయం


రాజుపేటలో నూతన గ్రామ సచివాలయం నిర్మాణం


 


వీ.ఆర్.పురం. పెన్ పవర్


 

వీ.ఆర్.పురం మండలం రాజుపేట గ్రామంలో నూతనంగా నిర్మిస్తున్న గ్రామ సచివాలయం పనులను మండల వై.ఎస్.ఆర్.సి.పి పార్టీ నాయకులు పరిశీలించడం జరిగింది ఈ సందర్భంగా వై.ఎస్.ఆర్.సి.పి.మండల కన్వీనర్ గోపాల్  మాట్లాడుతూ గతప్రభుత్వం పోలవరం ప్రాజెక్టును పెరుగాచూపించి గ్రామాల్లో అభివృద్ధి కార్యక్రమాలు చేయలేకపోయింది ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి రాష్ట్ర ప్రభుత్వం ముంపుతో సంబంధం లేకుండా ఇక్కడ నుండి నిర్వాసితులు వెళ్ళేఅంతవరకు వీరికి అన్ని సధుపాయలు కల్పించానే ఉదేశం మన నియోజకవర్గ ఎమ్.ఎల్.ఏ ధనలక్ష్మి డి.సి.సి.బీ చైర్మన్ అనంతబాబు ఇద్దరూ ముంపుమండలల్లో ఉన్న సమస్యలను మన ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లారు వెంటనే ఆయన స్పందించి వీ.ఆర్.పురం మండలం రాజుపేట కాలనిలో నూతనంగా నిర్మిస్తున్న గ్రామ సచివాలయం రైతు భరోసా కేంద్ర ఆరోగ్యకేంద్రం అంచనా విలువ ఎనభై లక్షల రూపాయలతో మండల ప్రజల కొరకు నిర్మాణ పనులు జరుగుతున్నాయి. ముంపుమండలల్లో లక్షల కోట్ల రూపాయలతో సి.సి.రోడ్లు,డ్రైనేజీలు నాడు నేడు ద్వారా స్కూల్ డెవలప్మెంట్ కార్యక్రమాలు మన రాష్ట్ర ప్రభుత్వం చేస్తుందని ఆయన అన్నారు.ఈకార్యక్రమంలో వై.ఎస్.ఆర్.సి.పి.మండల యూత్ కన్వీనర్ చిక్కాల బాలు, రాష్ట్ర కార్యదర్శి ముత్యాల శ్రీనివాసరావు, అరకు పార్లమెంట్ కార్యదర్శి బొడ్డు సత్యన్నారాయణ, మార్కెట్ కమిటీ డైరెక్టర్ మాచర్ల గంగులు, మామిడి రమణ,మాదిరెడ్డి సత్తిబాబు, ముత్యాల మురళి, కడుపు రమేష్, గణిత్రి కృష్ణ తదితరులు పాల్గొన్నారు.

జైభీమ్ విద్యపౌన్ డేషన్ అవార్డు





జైభీమ్ విద్యపౌన్ డేషన్ అవార్డు


 


రాజమండ్రి రూరల్ , పెన్ పవర్


 


రాజవోలు గ్రామనికిచెందిన బూసి సువర్ణవేణి కరోనా లో చెసినటువంటి సేవలను జైభీమ్ విద్యపౌంన్ డేషన్ అవార్డు ను అందించినారు కరోనా సమయంలో ప్రజలకుచేసినటువంటి సేవ ఎంతో గొప్పది ప్రాణాలకు తేగించి చేయాడం అంటే మాటాలలో చెప్పలేనిది నాకు ఇ అవార్డు ఇచ్చిన జున్న రాజుగారికి నా ధన్యవాదములు తేలుపుతున్నాను అని సువర్ణ వేణి అన్నారు


 

 




రెండోసారి గింటి


రెండోసారి గింటి


తూర్పు గోదావరి,పెన్ పవర్ 


 

తూర్పు గోదావరి జిల్లా కిర్లంపూడి మండలం గోనేడ గ్రామం లో గ్రామ పంచాయతీ లో ట్యాంక్ వాచర్ గా పనిచేస్తున్న     టి రాజ్ అబ్బాయి గత 17 సంవత్సరముల నుండి పని చేస్తున్నాడు .రాజ్ అబ్బాయికి రావలసిన జీవితము గురించి సంబంధిత అధికారి అయిన పంచాయతీ కార్యదర్శి కలసి తనకు రావలసిన జీతం ఇవ్వడం లేదు అని ఎన్నోసార్లు అడుగగా ఆయన దాటిస్తూ ఉన్నారు. 22వ తారీఖున సచివాలయం సెక్రటరీ విజయ్ కుమార్ అడుగగా రేపు రండి సీనియర్ సెక్రటరీ రమేష్ గారు వస్తారు, ఆయనతో మీరు మాట్లాడుతారు గానీ అని అమ్మని చెప్పగా 23 వ తారీఖున  పంచాయతీ కి వెళ్లి చూడగా ఆయన ఈరోజు కూడా రమేష్  గారు రాలేదు , అక్కడ ఉన్నటువంటి  విజయ్ కుమార్ గారితో నేను  మాట్లాడుతుండగా మధ్యలో వాలంటరీగా పనిచేస్తున్న అయినటువంటి పేప కాయల గంగాధర్ అనే వ్యక్తి  మధ్య కలుగజేసుకుని నిన్ను ఉద్యోగంలోంచి ఎప్పుడో తీసేసాం  నీకు జీతాలు లేవు ఏమి లేవు నువ్వు వెళ్ళిపో అని అసభ్య పదజాలంతో కులం పేరుతో దూషించి నా గుండెల పై చేయి వేసి  బయటకు నెట్టి వేగా నేను ఎలా బ్రతకాలి అని అడుగు తుండగా రెండోసారి గింటి వేసినారు .సార్ నేను  ఎలా బ్రతకాలి అని అడుగగా నువ్వు బ్రతికే బ్రతుకు లేకపోతే లేదు  కావాలంటే మా ఇంటి దగ్గర పురుగుల మందు ఉంది ఇస్తానురా అని రాజ్ అబ్బాయితో వాదించడం జరిగింది ఈ విషయమై ఎండిఓ గారిని కలిసి పిటిషన్  ఇవ్వడం జరిగింది .ఈ వాలంటరీ  పంచాయతీ ఆఫీసు దగ్గరకు వెళ్ళిన దళితులను చిన్నచూపు చూస్తూ అలాగే మహిళల పట్ల  అసభ్యకరంగా  ప్రవర్తిస్తూ తనకు తన దగ్గరకు ఆఫీస్ పనుల నిమిత్తం వచ్చిన  వాళ్లతో అసభ్యకరంగా మాట్లాడడం టువంటి పరిస్థితి .మేము కోరుకునేది ఒక్కటే ఇలాంటి  ఒక వాలంటరీ వలన మొత్తం వాలంటీర్ వ్యవస్థ  మరియు ప్రభుత్వానికి చెడ్డపేరు వచ్చే విధంగా ఇలాంటి వాలంటరీ లు వ్యవహరిస్తున్నారు. కాబట్టి ఇలాంటి వారిని వెంటనే విధుల నుంచి తొలగించాలని అలాగే వారిపై తగు చర్యలు తీసుకోవాలని రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా జిల్లా అధ్యక్షులుజుట్టుక . నాగేశ్వరరావు డిమాండ్ చేస్తున్నారు .ఇటీవల కాలంలో దళితులపై జరుగుతున్నటువంటి దాడులను అరాచకా లు ఎన్నో జరుగుతున్నాయి. ఇటీవల సీతానగరం ఒక దళితుడిపై శిరోముండన మధురపూడి గ్రామంలో దళిత అయినటువంటి ఒక మైనర్ బాలికను అలాగే సుధాకర్ ఒక దళిత బాలుడు అయినటువంటి వానికి మాస్క్ లేని నెపంతో కుట్టి చంపిన ఎటువంటి పరిస్థితి ఈరోజు మా గోనేడ గ్రామంలో  దళితుడు అయినటువంటి వ్యక్తిపై దుర్భాష లతో మాట్లాడిన టువంటి  ఇలా అనేకమైన చోట్ల జరుగుచున్న దాడులను తీవ్రంగా ఖండిస్తూ మా దళితులపై ఎందుకుమీరు ఇంత వివక్షత చూపుతున్నారు మా దళితులందరూ కలిసి  వైయస్సార్ పార్టీ కి  ఎంతో నమ్మకంతో ఓట్లు వేసి గెలిపిస్తే మీరు ఇచ్చే మీరిచ్చే గౌరవం దళితులకు ఇదేనా   వా పోతున్నాము. ఎప్పటికైనా  నాయకులు మాపై జరుగుతున్నటువంటి ఈ దాడులను రాష్ట్రంలో ఉన్నటువంటి ఏ ఒక్క నాయకుడు కూడా అడిగిన దాఖలాలు కనిపించకపోగా మమ్ములను నీచాతి నీచంగా చూస్తున్న పరిస్థితి . ఇలాంటి  పరిస్థితులు పునరావృతం అయితే మా దళితులంతా ఏకమై అసెంబ్లీని ముట్టడిస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఈ  కార్యక్రమంలో ఆర్ పి ఐ జిల్లా ప్రధాన కార్యదర్శి నూక పల్లి చంద్రశేఖర.్ అలాగే ఈ ఎన్ డి టి ఎస్ అధ్యక్షులు దిరిశాల పండు .చింతపల్లి చిట్టి బాబు . రాగం రాధాకృష్ణ .చినబాబు. ఏసుబాబు .గాలి శ్రీను. తదితరులు పాల్గొన్నారు.

గొప్పవ్యక్తుల్లో అబ్దుల్ కలాం ఒకరు





గొప్పవ్యక్తుల్లో అబ్దుల్ కలాం ఒకరు


 


.పిట్టా నాగమణి 


 


అన్నవరం , పెన్ పవర్ ప్రతినిధి


 

దేశం గర్వించదగ్గ గొప్ప వ్యక్తులల్లో అబ్దుల్ కలాం ఒకరు అని ఐ హెచ్ ఆర్ సి జిల్లా వైస్ చైర్మన్ పిట్టా నాగమణి అన్నారు ఆయన జీవితం నేటి యువతకు ఆదర్శం. సామాన్య కుటుంబంలో జన్మించి రాష్ట్రపతిగా ఎదిగిన ఆయన ఆత్యున్నత పదవిలోనూ నిరాడంబర జీవితాన్ని గడిపారు.11 వ రాష్ట్రపతి అయిన డాక్టర్ ఎపిజె అబ్దుల్ కలాం పూర్తి పేరు డాక్టర్ ఆవుల్ పకీర్ జైనులబ్దీన్ అబ్దుల్ కలాం. అక్టోబర్ 15,1931 న ఒక పేద ముస్లిం కుటుంబంలో  జన్మించారు.పేదవారు కావడంతో చిన్నప్పుడే చిన్న చిన్న పనులు చేయడం ప్రారంభించారు.కలాం శాఖాహరి,మద్యపాన వ్యతిరేకి,బ్రహ్మచారి,వ్యక్తిగత క్రమశిక్షణలకు ఎంతో ప్రాధాన్యతనిఇచ్చేవారు.1954 లో తమ తిరుచిరాపల్లిలో జోసెఫ్స్ కళాశాలలో భౌతికశాస్త్ర పట్టాను అందుకున్నారు.1955 లో మద్రాసులో ఏరోనా టిక్స్ ఇంజినీరింగ్ విద్యను అభ్యసించారు. స్వయం కృషితో తరువాతి కాలంలో ఆత్యున్నత శిఖరాలు అధిరోహించారు1960 లో ఇంజనీరింగ్ డిగ్రీ పొందాక రక్షణ సంస్థ డి ఆర్ డి ఒ లో శాస్త్రవేత్తగా చేరారు.భారత సైన్యం కోసం ఒక చిన్న హెలికాప్టర్ తయారుచేయడం ద్వారా తన వృత్తికి శ్రీకారం చుట్టారు. ఇలా దేశనికీ ఉపయోగ పడే ఎన్నో సంస్థలలో పనిచేసారు జుాలై 18, 2002 న బ్రహ్మాండమైన అధిక్యతతో 90 శాతంపైగా ఒట్లతో11వ భారత రాష్ట్రపతిగా విజయకేతనం ఎగురవేశారు.భారత మాతముద్దుబిడ్డ, మహనీయుడు అబ్దుల్ కలాం తన 84 వ ఏట జూలై  27 ,2015 న షిల్లాంగ్ లో విద్యార్దుల్ని ఉద్దేశించి ప్రసంగిస్తున్న ఆయన హఠాత్తుగా ప్రసంగం మధ్యలో కుప్పకూలిపోయి ఆస్తమించడం ఒ విషాదం. హఠాన్మరణానికి గురయ్యారు.భారతీయుల గుండెల్లో ఆయన మిసైల్ తారే ఆయన తీపి గుర్తులను సేవలు మారువ్వలేనివని పిట్టా నాగమణి అన్నారు.


 

 




రెండవరోజున బంద్


రెండవరోజున బంద్ విజయవంతం


- కరోనా కారణంగా ముంపు మండలాల్లో ఐదు రోజులు బంద్


 


వి.ఆర్.పురం. పెన్ పవర్ 


 

తూర్పుగోదావరి జిల్లా వి.ఆర్.పురం మండలం ముంపు మండలాల్లో 26.07.2020 తారీకు నుండి ఈ నెల 30.07.2020 వరకు జిల్లా కలెక్టర్ ఉత్తర్వుల మేరకు చింతూరు ఐ.టి.డి.ఏ. పి.ఓ. ఆకుల వెంకటరమణ ఆదేశాల మేరకు లాక్ డౌన్ అమల్లో భాగంగా వి.ఆర్.పురం మండలంలో లాక్ డౌన్ ఆంక్షలు పోలీసులు కఠినంగా అమలు చేస్తున్నారు. ఉదయం 6 గంటల నుండి 11 గంటల వరకు కూరగాయలు కిరాణా షాప్ లకు మాత్రమే అనుమతిచ్చారు. మెడికల్ షాప్ కు 24 గంటలు అనుమతి ఉన్నది మిగిలిన ఏ షాప్ లకు కూడా అనుమతి లేదని వి.ఆర్.పురం మండలం తహసీల్దార్ ఎన్. శ్రీధర్ ఆంక్షలు విధించారు. దీంతో రోడ్లన్నీ నిర్మానుష్యం గా కనిపిస్తున్నాయి. అవసరమైతే తప్ప రోడ్ మీదకి మండల ప్రజలు రావొద్దని పోలీసువారు సూచించారు. ఈ నెల 30 వరకు కఠిన ఆంక్షలు ఉంటాయని ఆయన తెలిపారు.

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...