Followers

మహిళ అనుమానాస్పద మృతి

మహిళ  అనుమానాస్పద మృతి 

మహిళ పై సమూహికంగా అఘాయిత్యం చేసి ..హత్య చేసినట్లు పలు అనుమానాలు..

 పోలీస్ క్లూస్ టీం పరీశీలన..

మిష్టరీని చేదించేందుకు జిల్లా ఏఎస్పీ   యోగేష్ గౌతమ్

బయ్యారం, పెన్ పవర్


మహుబూబాబాద్ జిల్లా బయ్యారం మండల కేంద్రంలోని జగ్ తండా పంచాయితి బీసీ కోలని లో గుర్తు తెలియని వ్యక్తులు బుదవారం రాత్రి  నిమ్మల యాకమ్మ (29)ను.  అతి కిరాతకంగా ఆమెపై  అఘాయిత్యానికి పాల్పడి ఆపై హత్య చేసినట్లు స్థానికులు తెలిపారు. దీనిపై స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం మృతురాలు కూలి పనులకు వెళ్లుతుండేదని.. భర్త రామారావు ఖమ్మం లో హమాలి పని చేస్తూ ఉండేవాడని భార్య భర్తలు చాలా ఆన్యోన్యంగా ఉండేవారని పేర్కొన్నారు. మృతురాలు ఆ కాలనీలో మరి కొంత మంది మహిళలతో
రాత్రి సమయాలలో ట్రాక్టర్లలో ఇసుక నింపేందుకు కూలీ పనులకోసం వెళుతుండేవారని తెలిపారు. ఇంత దారుణానికి ఎలా ఒడి గట్టి హత్య చేశారో తెలియడం లేదని.. హత్య జరిగిన సమయంలో ఇంటి చుట్టూ పక్కల ఇల్లు తాళాలు వేయడం... ఎవరు లేక పోవడంతో  మృతురాలిని ఇంటి పక్కనే నిర్థీవ ప్రాంతంలో హత్య చేసి.. ఇంటి వరండా బాగంలో నిందితులు  విద్యుత్ షాక్ తో  చని పోయే విదంగా  చిత్రీకరీంచే ప్రయత్నం చేసినట్లు కనపడుతుందని తెలిపారు. మృతురాలికి ఇద్దరు కుమారులు పెద్ద కుమారుడు సూర్య.. (08), చిన్న కుమారుడు ఆది (03), చిన్న కుమారుడు ఆనారోగ్యంతో బాధపడుతున్నాడని తెలిపారు. దీనిపై స్టానిక ఎస్ ఐ జగదీష్ తమ సిబ్బందితో మహిళ  అనుమానాస్పద మృతి  సంఘటణ ప్రాంతాన్ని పరిశీలించి,  విషయాన్ని జిల్లా పోలీసు అధికారులు తెలుపడంతో, జిల్లా ఏఎస్పి  యోగేష్ గౌతమ్ చేరుకొని క్లూస్ టీం తో ఫోరెన్సీ అధికారులు చేరుకొని ఆప్రాంతాన్ని క్షుణ్ణం గా పరిశీలించారు. అనంతరం  కేసు నమోదు చేసి శవాన్ని పోస్టు మార్టం నిమిత్తం జిల్లా ఏరియా ఆసుపత్రికి తరలించారు.

39వ వార్డు పర్యటనలో వైఎస్ఆర్సిపి కార్పొరేటర్ అభ్యర్థి కొల్లి సింహాచలం

 39వ వార్డు పర్యటనలో  వైఎస్ఆర్సిపి కార్పొరేటర్ అభ్యర్థి కొల్లి  సింహాచలం




మహారాణి పేట, పెన్ పవర్

  39కొత్త వార్డ్ చిలకపేటలో వీధి వీధి తిరుగుతూ ప్రజల సమస్యలపై  డ్రైనేజీ నీరు, నిలుపుదల వల్ల అక్కడ ప్రజలు ఇబ్బంది పడుతున్నారని తెలియగానే అక్కడికి చేరుకుని సంబంధించిన జీవీఎంసీ అధికారులు సానిటరీ ఇన్స్పెక్టర్ లతో  ఫోన్ లో మాట్లాడి తక్షణమే తగు చర్యలు చేపట్టాలని ఆదేశించి,అక్కడ నివసించే ప్రజలు ఎక్కువుగా  డ్రైనేజీ వాటర్ వెళ్లుటకు అవకాశం లేనందువల్ల దోమలు చేరకుండా ఉండేందుకు దోమలు నివారణ చర్యలు లో భాగంగా ఫాగింగ్ చేయాలని ప్రజలు వినతి పత్రం అందజేశారు.తక్షణమే సమస్యలపై. ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ దృష్టికి తీసుకొని వెళ్లి సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇచ్చిన కొల్లి సింహాచలం అనునిత్యం ప్రజల్లో ఉంటూ, ప్రజల యొక్క ప్రతీ సమస్య తన సమస్యగా భావించి తక్షణమే చర్య చేపట్టి ప్రజల మన్నలను పొందుతున్న ఎమ్మెల్యే గారని అక్కడ ప్రజలు హర్షం వ్యక్తం చేశారు.ఈ మాజీ కార్పొరేటర్ కుల పెద్ద కదిరి అప్పారావు ముస్లిం కుల పెద్ద అలీ ఖాన్ కుమారడు నూశృద్ద్ అలీ ఖాన్ సౌత్ మైనారిటీ ప్రెసిడెంట్  ముజీబ్ ఖాన్,వర్కింగ్ ప్రెసిడెంట్ ముత్తు నల్ల బాబు మహిళా వార్డు ప్రెసిడెంట్ మాధురి,మత్తు శ్రీను(,సి మెన్ శ్రీను )హెరా  సాయి,బాబ్జి,తిత్తి కృష్ణ ,కుదీర్ తుల్ల,కామల్,రమణ విజయ్,మాణికుమార్,వెంకట్,అమ్మోరు,బంగారి, పెంటయ్య,కదిరి చిన్నప్ప రావు,సి మెన్ బాషా, ఇబ్రహీం, శివ,లాయర్ రసూల్,కదిరి చిన్న అప్పారావు, యూసుఫ్,బుకరి ఖాన్,మామ,దూడ తాతారావు, సలీమ్, బంగారి,హరి,పెంటయ్య,సన్యాసి రావు, ఇక్బాల్,వెంకట్,శివ,రాంబాబు,శివ,సంతోష,రవి, ప్రసాద్,రమణ,సత్తిబాబు,రాము,రాజు,రవి,సంజయ్, నవీన్,రామకృష్ణ,సతీష్, వరహాలు రావు,సకల సూరి,మంగరాజు,బుజ్జి,కొండా,హమీద్,సతీష్, రాజు, పైడినాయుడు,గణేష్, వేణు,ఎల్లాజీ,రమణమ్మ, నూకరత్నం, కదిరి చిన్న అప్పారావు,మాలతి,అనిల్, అది, శ్రీను, క్రాంతి,సాయి,పవన్,రాజేష్,ధనరాజు, స్థానిక మహిళలు, వైస్సార్సీపీ కార్యకర్తలు, అధిక సంఖ్యలో స్థానిక ప్రజలు ,తదితరులు పాల్గొన్నారు.

వైకాపా నాయకులు ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్నారు

వైకాపా నాయకులు ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్నారు









మేయర్ అభ్యర్థిని ప్రకటించే ధైర్యం వైకాపాకు లేదు

విజయనగరం,పెన్ పవర్

 వైకాపా నాయకులు ప్రజాస్వామ్యాన్ని అప్రహాస్యం చేస్తున్నారని ఎమ్మెల్సీ ద్వారపురెడ్డి జగదీష్ విమర్శించారు. ఓటమి భయంతోనే బలవంతపు ఏకగ్రీవాలు  చేయిస్తున్నారని ఆరోపించారు. పార్టీ కార్యాలయంలో గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ విజయనగరం కార్పొరేషన్ కి మేయర్ అభ్యర్థిని ప్రకటించలేని పరిస్థితిలో వైకాపా ఉందని ఎద్దేవా చేశారు. ప్రజారంజక పాలన చేస్తున్నామని గొప్పలు చెప్పుకుంటున్న వైకాపా నాయకులు ఎన్నికల్లో బెదిరింపులకు, ప్రలోభపెట్టడానికి ఎందుకు ప్రయత్నాలు చేస్తున్నారని ప్రశ్నించారు. మాన్సాస్ సంస్థలో అడ్డదారిలో చైర్మన్ గా వచ్చిన సంచయిత వివాదాస్పద నిర్ణయాలు
తీసుకుంటుంటే జిల్లాలో మంత్రులు ,ఎమ్మల్యేలు ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు విజయనగరం పట్టణంలో అభివృద్ది తెలుగుదేశం పార్టీ హయాంలోనే జరిగిందన్నారు. కేవలం అసత్య ప్రచారాలతో వైకాపా ప్రజాప్రతినిధులు ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు.తెలుగుదేశం పార్టీకి ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారన్నారు. దీనిని చూసి ఓర్వలేక అడ్డదారిలో గెలవాలని వైకాపా నాయకులు ప్రయత్నాలు చేస్తున్నారని ఎద్దేవా చేశారు. విజయనగరం మేయర్ పీఠాన్ని తెలుగుదేశం పార్టీ కైవసం చేసుకోవడం ఖాయమన్నారు. వైకాపాకు అనుకూలంగా ఎన్నికల్లో పనిచేస్తున్న అధికారులు, వాలంటీర్లపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో పార్టీ నాయకులు ఐవిపి రాజు, కరణం శివరామకృష్ణ, త్రిమూర్తులరాజు, విజ్ఞపు ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.

విద్యార్థులు అభినందించిన శ్రీ చైతన్య పాఠశాల యాజమాన్యం

 విద్యార్థులు అభినందించిన శ్రీ చైతన్య పాఠశాల యాజమాన్యం

మందమర్రి, పెన్ పవర్

మందమర్రి పట్టణంలోని శ్రీ చైతన్య పాఠశాల యాజమాన్యం గురువారం పాఠశాల విద్యార్థులకు అభినందన సభ నిర్వహించి, విద్యార్థులను అభినందించారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయులు అయూబ్ మాట్లాడుతూ, గత నాలుగు సంవత్సరాల నుండి నేషనల్ స్పేస్ సెటిల్మెంట్ (ఎన్ఎస్ఎస్) ఆర్గనైజిర్ ద్వారా నాసాకు ప్రాజెక్టును పాఠశాల విద్యార్థులు నిర్వహిస్తున్నారని, ప్రతిభ కనబర్చిన విద్యార్థులకు ఎన్ఎస్ఎస్ వారు అభినందన పత్రాలు పంపించగా, నేషనల్ సైన్స్ డే పురస్కరించుకొని గురువారం విద్యార్థులకు అభినందన పత్రాలు అందజేసినట్లూ తెలిపారు. ఈ సందర్భంగా విద్యార్థులను పాఠశాల చైర్మన్ శ్రీధర్, డైరెక్టర్ శ్రీవిద్య, డిజిఎం లక్ష్మణ్ రావు, ఆర్ఐ రాజు, అకాడమీ కోఆర్డినేటర్ కృష్ణారావు లు అభినందించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల డీన్ నాగేశ్వరరావు, గైడ్ టీచర్ పోచమల్లు తదితరులు పాల్గొన్నారు.

జిల్లా వ్యాప్త ఆటోల బంద్ ను విజయవంతం చేయండి

 జిల్లా వ్యాప్త ఆటోల బంద్ ను విజయవంతం చేయండి

మందమర్రి ,పెన్ పవర్

పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలకు నిరసనగా, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆటోడ్రైవర్ పట్ల అనుసరిస్తున్న విధానాలను నిరసిస్తూ ఆటో యూనియన్ జిల్లా అధ్యక్షులు ముఖేష్ గౌడ్ ఇచ్చిన పిలుపు మేరకు శుక్రవారం నిర్వహించే జిల్లా వ్యాప్త ఆటోల బంద్ లో ప్రజలు, ఆటో డ్రైవర్లు స్వచ్ఛందంగా పాల్గొని విజయవంతం చెయ్యాలని ఆటో యూనియన్ మందమర్రి పట్టణ అధ్యక్షులు మేడి రాజు  కోరారు. గురువారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆటో డ్రైవర్ల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా ప్రభుత్వ విప్, చెన్నూరు ఎమ్మెల్యే బాల్క సుమన్ ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు ఆటో డ్రైవర్లకు డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు, కమ్యూనిటీ హాల్ నిర్మించి హామీని నెరవేర్చాలని కోరారు. ఈ కార్యక్రమంలో యూనియన్ నాయకులు ఉప్పరి సుభాష్, కొప్పుల రమేష్, ఎండీ షరీఫ్, దాసరి రాజ్ కుమార్, బొల్లు రవి తదితరులు పాల్గొన్నారు.

పెదపళ్ల గ్రామంలో వైఎస్సార్ పొలంబడి

 పెదపళ్ల గ్రామంలో వైఎస్సార్ పొలంబడి



వ్యవసాయ శాఖ ఏడీఏ చౌదరి

పెన్ పవర్, పెదపళ్ల 

    ఆధునిక వ్యవసాయ పద్ధతుల ద్వారా అధిక దిగుబడులు సాధించవచ్చని ఆలమూరు వ్యవసాయ శాఖ సబ్ డివిజన్ ఏడీఏ సీహెచ్ కేవీ చౌదరి, వ్యవసాయ శాఖ అధికారిణి (ఏవో) సోమిరెడ్డి లక్ష్మి లావణ్య అన్నారు. ఆలమూరు మండలంలో పెద్దపల్ల  గ్రామంలో డాక్టర్ వైయస్ఆర్ పొలంబడి కార్యక్రమం ఆలమూరు సహాయ వ్యవసాయ  సంచాలకులు వీహెచ్ కేవీ చౌదరి, ఏవో ఎస్ లక్ష్మి లావణ్య అద్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యకరమమలో రైతులకు ఆధునిక వ్యవసాయ సాగు విధానాలు గురించి వివరించారు. పొలంబడిలో నాలుగు యాజమాన్య సూత్రాలు, పొలం పరిసరాల విశ్లేషణ, బాగస్వామ్య  కార్యాచరణ, పరిశోదనలు వంటివి క్షేత్రస్థాయిలో రైతులతో పొలంలో నిర్వహించారు. అలాగే సుడిదోమ,జీవిత చక్రం దానికి నివారణకు తూటికాడ కాషాయం తయారీ విధానం తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ప్రతి వారం నిర్వహించే ఈ పొలంబడి శిక్షణను రైతులు వినియోగిచుకోవలని తెలియజేశారు. అనంతరం పంట పొలాలను సందర్శించి రైతులతో చర్చలు జరిపి తగు సూచనలు సలహాలు ఇచ్చారు. ఈ కార్యక్రమంలో పెదపల్ల, గుమ్మిలేరు, సంధిపూడి, మోదుకురు గ్రామా వ్యసాయ సహాయకులు, రైతులు పాల్గొన్నారు.

సమర్థులను ఎన్నుకోండి అభివృద్ధికి బాటలు వేయండి

 సమర్థులను ఎన్నుకోండి అభివృద్ధికి బాటలు వేయండి ఓటు వేసి గెలిపించండి 






18వ వార్డు అభివృద్ధి చేసి చూపిస్తా  స్థానికులకు అవకాశం ఇవ్వండి 

మీతోనే ఉంటాను బిజెపి జానసేన ఉమ్మడి  కార్పొరేటర్ అభ్యర్థిని  ద్వారపురెడ్డి అరుణకుమారి ఇంటింటా ప్రచారం

విశాఖ తూర్పు పెన్ పవర్

భారతీయ జనతా పార్టీ, జనసేన బలపరిచిన ఉమ్మడి కార్పొరేటర్  అభ్యర్థిని గా పోటీ చేస్తున్న ద్వారపు రెడ్డి  అరుణకుమారి ఎన్నికల ప్రచారంలో భాగంగా 9వ వార్డ్ డి ఆర్ డి ఎ  ఆఫీస్ పరిధిలో ప్రచార కార్యక్రమాన్ని నిర్వహించారు ఒక్కసారి అవకాశం ఇచ్చి తనకు గెలిపించినట్లయితే వార్డ్ అభివృద్దే  ప్రధాన ధ్యేయంగా పని చేస్తానని ప్రజలకు హామీ ఇచ్చారు నేను పుట్టిన ఈ ప్రాంతం రుణం తీర్చుకుంటానని,  ఒక అవకాశం ఇవ్వండి అని ముందుకు సాగారు చదువుకున్న వ్యక్తి, న్యాయవాది అయ్యి ఉండటం వల్ల  సమస్యల  మీద తనకు ఒక అవగాహన  ఉందని,  ఆ సమస్యను ఏవిధంగా పరిష్కరించాలనే నమ్మకంతో ప్రజలు  ముందుకు వస్తున్నానని అన్నారు  విజయమే లక్ష్యంగా ముందుకు దూసుకుపోతున్నారు.  ప్రతి ఒక్కరూ తమ వంతు భాగంగా తనకు ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ప్రజలను కోరారు. ఈ ప్రచార కార్యక్రమంలో వార్డ్ అధ్యక్షులు శ్యామ్ కుమార్.,  రామారావు మరియు బిజెపి కార్యకర్తలు, జనసేన కార్యకర్తలు పాల్గొన్నారు.

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...