Followers

అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపిన బండారు

 అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపిన బండారు


రవాడ,పెన్ పవర్

 మండలం,నాయుడు పాలెం జంక్షన్లో సోమవారం నూతనంగా ప్రారంభించిన టిడిపి కార్యాలయంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి ముందు మాజీ మంత్రి,ఎమ్మెల్యే బండారు సత్యనారాయణమూర్తి, మాజీ ఎమ్మెల్యే గండి బాబ్జి, ముఖ్య అతిదులుగా పాల్గొనే రిబ్బన్ కత్తిరించి నూతన ప్రాంతీయ టిడిపి కార్యాలయాన్ని ప్రారంభించారు. అనంతరం అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా కేకు కట్ చేసి మహిళలకు అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేశారు.

ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పీటీసీ సభ్యులు పయిల జగన్నాధరావు, మాజీ మండల అధ్యక్షులు మాసవరపు అప్పలనాయుడు,టిడిపి జడ్పిటిసి అభ్యర్థి అట్ట సన్యాసి అప్పారావు, మాజీ సర్పంచ్ కుండ్రపు సన్యాసినాయుడు,మాజీ ఎంపీటీసీ సభ్యులు శ్రీరామ్మూర్తి, స్థానిక టిడిపి నాయకులు కుండ్రపు మధు, తదితరులు పాల్గొన్నారు.

బిజెపి అధికారంలో హింసాత్మక ఘటనలు...

 బిజెపి అధికారంలో హింసాత్మక ఘటనలు...

అనంతగిరి,పెన్ పవర్ 

అనంతగిరి మండల కేంద్రం గిరిజన సంఘం కార్యాలయంలో మహిళా సంఘం ఆధ్వర్యంలో ప్రపంచ మహిళా దినోత్సవం నిర్వహించడం జరిగింది. ఈసందర్భంగా మహిళా సంఘం నాయకురాలు ఆల్ ఇండియా డెమోక్రటిక్ మహళ సంఘం ఏఐడి డబ్యు ఏ జి ల్లా కార్యదర్శి వి. వి. జయ మాట్లాడుతూ కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత దేశంలో హింసాత్మక సంఘటనలు దేశంలో ఎక్కువ జరుగుతున్నాయి. మహిళలకు రక్షణ లేకుండా పోయిందని ఎక్కడ చూసినా హత్యలు అత్యాచారాలు మానభంగాలు జరుగుతున్న కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం పట్టించుకోన దాఖలాలు లేవు నిత్యం నిత్యావసర వస్తువుల ధరలు విపరీతంగా పెరగడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు పెట్రోల్ డీజిల్ గేస్ ధరలు విపరీతంగా పెరగడంతో ప్రజలపై భారాలు పడుతున్నాయి. మరిముఖ్యంగా స్త్రీలకు రక్షణ లేకుండా పోయిందని అన్నారు. మతోన్మాదం పేరుతో ప్రజలకు చిచ్చు పెట్టే పనిలో ఉన్నారు. ప్రజ సమస్యలపై దృష్టి సారించలేదనారు ఈకార్యక్రమంలో అనంతగిరి సిఐటియు అధ్యక్షులు జి. కళవతి కార్యదర్శి ఎస్. సుమిత్ర ఉపాధ్యక్షులు పి మంజుల. అనంతగిరి మహిళా సంఘం అధ్యక్షులు. బాక కాసులమ్మ. నందుల. సుమిత్ర. దీసరి. శ్రావణి. దీసరి. దేముడమ్మ. జన్ని. దేవీ యుటిఎఫ్ నాయకులు శెట్టి. రాంబాబు. పుడిగి. దేముడు. ఈశ్వరరావు. పరమేశ్వర. నగేష్ మాస్టర్లు అనంతగిరి సిపిఎం పార్టీ జెడ్పీటీసీ అభ్యర్థి దీసరి గంగరాజు. గిరిజన సంఘం నాయకులు జన్ని. సుబ్బారావు. ఎస్. నాగులు అంగన్వాడీ ఆశావర్కర్లు మహిళలు పాల్గొన్నారు.

మహిళా దినోత్సవం సందర్భంగా ఉపాధ్యానిలకు సన్మానం

 మహిళా దినోత్సవం సందర్భంగా ఉపాధ్యానిలకు సన్మానం

 పరవాడ,పెన్ పవర్

 గ్రామం లోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల లో అంతర్జాతీయ మహిళ దినోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన వేడుకలకు ముఖ్య అతిధిగా విచ్చేసిన రాష్ట్ర సీఈసీ సభ్యులు పయిల శ్రీనివాసరావు,పరవాడ నూతన సర్పంచ్ సిరిపురపు అప్పలనాయుడు ముఖ్య అతిథులుగా హాజరు అయ్యారు.ఈ సందర్భంగా రాష్ట్ర సీఈసీ సభ్యులు పయిల శ్రీనివాసరావు ముందుగా  మహిళ సోదరీమణులును అభినందించి , అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.అనంతరం రాష్ట్ర సీఈసీ సభ్యులు పయిల శ్రీనివాసరావు మాట్లాడుతూ  మహిళలు అన్ని రంగాల్లో రాణించిన సమాజమే అభివృద్ధి చెందుతుందని తెలిపారు. మహిళలకు యావత్‌ సమాజం అండగా నిలవాలని, మహిళలు స్వయం సమృద్ధి సాధించి పురోగమించాలని కొనియాడారు.స్త్రీ లేకపోతే అసలు జననమే లేదని,స్త్రీ లేకపోతే అసలు సృష్టే లేదని పేర్కొన్నారు.మహిళలు బాగుంటేనే దేశం, రాష్ట్రం బాగుంటుంది అని చెప్పారు.మన ఆంద్రప్రదేశ్ గౌరవ ముఖ్యమంత్రి వర్యులు వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి ఎటువంటి సంక్షేమ పథకాలు అమలు చేసిన నేరుగా మహిళల ఖాతాలు లోకే జమ చెయ్యడం చాలా అభినందనీయం అని చెప్పారు.ఈ యొక్క ఘనత మన ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి దక్కింది అని చెప్పారు. అనంతరం నుతన సర్పంచ్ సిరిపురపు అప్పలనాయుడు ని ఉప సర్పంచ్ బండారు రామారావు ని ఉపాద్యాయులు ఘన సన్మానం చేశారు.ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొన్న  పిఎంసి చైర్మన్ పయిల హరీష్ ,రాష్ట్ర విద్యార్థి విభాగం కార్యదర్శి గెడ్డం ఉమ,14 వ వార్డు మెంబెర్ సిరిపురపు రాజేష్, పయిల పైడం నాయుడు, ఉపాధ్యాయులు,పిల్లలు తదితరులు పాల్గొన్నారు.

దేశపురోభివృద్ధిలో మహిళలదే కీలకపాత్ర....

 దేశపురోభివృద్ధిలో మహిళలదే కీలకపాత్ర...

పెన్ పవర్,విశాఖపట్నం

దేశపురోభివృద్ధిలో మహిళలు కీలకపాత్ర పోషిస్తున్నారని మానవహక్కుల కమిటీ రాష్ట్ర కన్వినర్, ఉత్తరాంధ్ర మహిళా కమిటీ సభ్యురాలు శుభ అలియాస్ (చిన్ని) అన్నారు. సోమవారం మహిళాదినోత్సవాన్ని పురస్కరించుకుని పాడేరు డివిజన్ పరిధిలో పలు గ్రామాలలొ మహిళలకు సన్మానకార్యక్రమం చేపట్టారు. ఈ సంధర్భంగా ఆమె మాట్లాడుతూ  గిరిజన ప్రాంతాలలోని గ్రామాలలొ మహిళలకు మహిళాదినోత్సవంపై అవగాహనలేదన్నారు. గిరి మహిళలకు మహిళా చట్టాలపైన వారి హక్కులపైనా అవగాహన కల్పించే దిశగా పలు కార్యక్రమాలు చేపడుతున్నామన్నారు. సమాజంలో వస్తున్న ఆధునిక పోకడల దృష్ట్యా మహిళల భద్రత ప్రశ్నార్ధకంగా మారుతున్న పరిస్థితులలో తమను తాము రక్షించుకునే 'దిశ ' గా అవగాహన చేపట్టామన్నారు.తల్లిగా,చెల్లిగా భార్యగా,ఉద్యోగినిగా పలు రంగాలలో మహిళలు రాణిస్తూ దేశానికి దశ-దిశగా దిక్సూచిగా నిలుస్తున్నారన్నారు. పాడేరు మేజర్ పంచాయితీ సర్పంచ్ గా ఎన్నికైన మహిళ ఉషారాణిని సన్మానించినట్లు తెలిపారు. ఆరోజుల్లో బస్ లో టిక్కెట్టు తీసుకోవడానికి భయపడే స్థాయి నుండి విమానాలు, ఓడలు నడిపే స్థాయికి మహిళ ఎదగడం ఆనందదాయకమన్నారు. ప్రతి మహిళ విజయం వెనుక కుటుంబ సభ్యులు తండ్రి, సోదరుడు భర్త ప్రోత్సాహం వుంటుందన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు విశాఖజిల్లా కన్వినర్ రాణి అలానే గిరిజన మహిళలు పాల్గొన్నారు.

ఓటు వేయమంటూ పాదాభిషేకం.

 ఓటు వేయమంటూ పాదాభిషేకం

నెల్లికుదురు,పెన్ పవర్

మహుబూబాద్ జిల్లా నెల్లికుదురు మండలం లో తెరాస ఎమ్మెల్సీ అభ్యర్థి కి మొదటి ప్రాధాన్యత ఓటు వేయమని తోర్రూర్ వ్యవసాయ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ జిలుకర యాలాద్రి మండల కేంద్రం లో సీనియర్ ప్రైవేట్ ఉపాద్యాయుడైన కొరియవుల కృష్ణ య్య సార్ ని  కలసి శాలువాతో సత్కరించారు  అనంతరం పాదాభివందనం చేసి తెరాస ఎమ్మెల్సీ అభ్యర్థి కి ఓటు వేసి గిలిపించాలని ప్రాధేయపడ్డారు.

విద్యార్థినిలు ఆత్మస్థైర్యంతో ముందడుగు వేయాలి...

 విద్యార్థినిలు ఆత్మస్థైర్యంతో ముందడుగు వేయాలి...

వి.మాడుగుల,పెన్ పవర్

  విద్యార్థినిలు ఆత్మస్థైర్యంతో ముందడుగు వేయాలని మాడుగుల జె ఎఫ్ సి ఎం  మెజిస్ట్రేట్ శ్రీమతి  అన్నారు. సోమవారం  అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా  స్థానిక పోలీసుల ఆధ్వర్యంలో జిల్లా పరిషత్ హై స్కూల్ విద్యార్థుల డిబేట్ కాంపిటీషన్ లో గెలు పొందినవారికి   ఆమె మెరిట్ సర్టిఫికేట్ మెమొంటో లు బహూకరించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ విద్యార్థులు కౌమారదశలో  అవగాహనతో అడుగులు వేయాలని సూచించారు. మహిళలకు ఎన్నో చట్టాలు ఉన్నాయని  వాటిని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. పోటీతత్వం అలవర్చుకున్నాడు భవిష్యత్తు  బాగుంటుందని అన్నారు.  విద్య పట్ల  శ్రద్ధ చూపాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎస్ ఐ పి రామారావు మహిళా పోలీసులు  విద్యార్థినిలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

పురుషులతో సమానంగా మహిళలు ఎదగాలి;జిల్లా కలెక్టర్

 పురుషులతో సమానంగా మహిళలు ఎదగాలి;జిల్లా కలెక్టర్

వనపర్తి, పెన్ పవర్

మహిళలు పురుషులతో సమానంగా అన్ని రంగాలలో  ఎదగాలని వనపర్తి జిల్లా కలెక్టర్ షేక్ యాస్మిన్ భాష అన్నారు. సోమవారం ప్రపంచ మహిళా దినోత్సవం సందర్భంగా జి గార్డెన్ ఫంక్షన్ హాల్ లో జరిగిన మహిళా దినోత్సవ  కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా జిల్లాఎస్పీ అపూర్వ రావు  తో పాటు  పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ మహిళలు వారు చేసే పనిని చాలెంజిగా స్వీకరించి చేయాలన్నారు. మారుతున్న సాంకేతిక పద్ధతులను బట్టి మహిళలు కూడా ఎదగాలని సూచించారు. కోవిడ్  సమయంలో మహిళా ఉద్యోగుల విశేష సేవలందించారని ప్రశంసించారు. మహిళలు చదువుకుంటేనే అన్ని రంగాలలో ఎదగడానికి వీలుంటుంది అన్నారు.ఎస్పీ అపూర్వ రావు మాట్లాడుతూ మహిళలు ఆత్మస్థైర్యంతో ముందుకు సాగాలని అన్నారు. ఒక మహిళ చదువుకుంటే సమాజం ఇల్లు బాగుంటుందని అన్నారు. అనంతరం ప్రభుత్వ శాఖలో విశేష సేవలు అందించిన మహిళా ఉద్యోగినులకు అవార్డులు అందజేశారు. డి ఆర్ డి ఏ ఆధ్వర్యంలో మహిళా సంఘాలకు చెక్కులను అందజేశారు. ఈ కార్యక్రమంలో డి డబ్ల్యూ ఓ పుష్పలత, డి ఆర్ డి ఎ కోదండం, మున్సిపల్ కమిషనర్ మహేశ్వర్ రెడ్డి, డబ్ల్యూ కృష్ణ చైతన్య, సిడిపిఓలు సూపర్వైజర్లు తదితరులు పాల్గొన్నారు.

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...